breaking news
British national
-
జిహాదీ జాక్ దొరికిపోయాడు
సిరియా: జిహాదీ జాక్ పట్టుబడ్డాడు. కుర్దీష్ ఫైటర్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్లో జాక్ చేరినట్లుగా అతడిపై నేరారోపణలు ఉన్న విషయం తెలిసిందే. బ్రిటన్ సంతతికి చెందిన జాక్ ఆక్స్ఫర్డ్లో ఉండేవాడు. అక్కడ నుంచే చెర్వెల్ స్కూల్లో విద్యాభ్యాసం చేశాడు. జాన్ లెట్స్(55), శాలీలేన్(54) కుమారుడైన జాక్.. తర్వాత ఇస్లాం మతంలోకి మారిపోయాడు. ఆ తర్వాత అనతి కాలంలోనే నేరుగా సిరియా వెళ్లి అక్కడ ఐసిస్లో చేరినట్లు తెలిసింది. ప్రస్తుతం అతడిని కుర్దీష్ల ఆదీనంలో ఉన్న జైలులో ఉంచినట్లు లండన్కు చెందిన అల్ అరబీ అనే ఓ వార్తా చానెల్ తెలిపింది. ‘నేను మా అమ్మను చూడాలని అనుకుంటున్నాను. ఆమెకు కొన్ని విషయాలు వివరించాలి’ అని కుర్దీష్లకు పట్టుబడిన తర్వాత చెప్పాడంట. బ్రిటన్ పౌరసత్వాన్ని కలిగి ఉన్న జిహాదీ జాక్ 2014లో సిరియా వెళ్లడమే కాకుండా ఓ ఇరాకీ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అతడికి మహ్మద్ అనే కుమారుడు కూడా ఉన్నట్లు అధికారులు గతంలోనే తెలుసుకున్నారు. ఐసిస్లో చేరడానికి ముందు జాక్గా ఉన్న తన పేరును అబూ మహ్మద్ అని మార్చుకున్నాడు. సిరియాలో ఉన్న సమయంలో పలు రకాల ఆయుధాలు ధరించి వీడియోల్లో చూపిస్తూ జిహాదీ జాన్ మాదిరిగా తానిప్పుడు పనిచేస్తున్నానంటూ వీడియోలో పోస్ట్ కూడా చేశాడు. ఐసిస్లో అత్యంత క్రూరంగా బందీల పీకలు కోసే ఓ ముసుగు వ్యక్తి జిహాదీ జాన్. అతడి స్థానంలోనే తాను పనిచేస్తున్నానంటూ జాక్ పోస్టింగ్లు చేసినా ఐసిస్ నుంచి మాత్రం ఎలాంటి నిర్ధారణ రాలేదు. అయితే, ఐసిస్లో ఉండే పనిచేస్తున్నాడని మాత్రం ధ్రువీకరించారు. -
విమానంలో హైదరాబాద్ ఉద్యోగినికి వేధింపులు
హైదరాబాద్: మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి కటకటాలపాలయ్యాడో బ్రిటన్ దేశస్థుడు. సింగపూర్ నుంచి హైదరాబాద్ బయల్దేరిన విమానంలో బ్రిటన్కు చెందిన అంటోనీ (60) అనే వ్యక్తి గతరాత్రి 11.30 గంటల ప్రాంతంలో 35 ఏళ్ల తోటి ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. విమానం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోగానే హైదరాబాద్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేసినట్టు సబ్ ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. బాధితురాలు హైదరాబాద్లోని ఓ బిజినెస్ స్కూల్లో ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంటోనీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరపర్చినట్టు తెలిపారు. దాంతో స్థానిక కోర్టు అతడికి జుడిషియల్ కస్టడీ విధించడంతో రిమాండ్కు తరలించారు. కాగా, నిందితుడు అంటోనీ అప్పుడప్పుడూ తన వ్యాపార వ్యవహారాల విషయమై తరచూ హైదరాబాద్కు వచ్చిపోతుంటాడనీ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు.