breaking news
Bhaskar Bhandari
-
అర్హులందరికీ పింఛన్లు
గద్వాల/గద్వాలన్యూటౌన్ : అర్హుల ఎంపికలో పొరబాట్ల ను సరిదిద్ది అర్హులైన వారందరికీ ‘ఆసరా’ను అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా పరిషత్ చైర్మ న్ బండారి భాస్కర్ అన్నారు. ఆది వారం స్థానిక పీజేపీ క్యాంపు కాలనీ లో గద్వాల ఆర్డీఓ అబ్దుల్ హమీద్ అధ్యక్షత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవ రూ అధైర్యపడరాదని,ప్రచారాలు న మ్మరాదని సూచించారు. అర్హులందరికీ పింఛన్లు అందుతాయని, ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే బాదితులకు న్యా యం జరిగేలా చూస్తామన్నారు. అర్హులను కూడా తొలగిస్తున్నట్లు ప్రచారం చేయడంలో అర్థం లేదన్నారు. ఎమ్మె ల్యే డీకే అరుణ మాట్లాడుతూ అర్హులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. తమ హయూంలో అర్హులందరికీ పింఛన్లను అందించామన్నారు. ఈ విషయంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని కోరారు. ఇందుకుగాను తాము ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఆర్డీఓ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ అర్హులైన వారందరికీ న్యాయం చేస్తామని, ఇందులో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండల పద్మావతి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. మాటల తూటాలు... జడ్పీచైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉంటూ తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని అప్పటి సీఎం అన్నా స్పందించనివారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై నిందలు వేయడం భావ్యం కాదన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఏనాడూ తెలంగాణ జెండా మోయని వ్యక్తులు, ఉద్యమంలో పాల్గొనని వారు టీఆర్ఎస్ పేరిట నేతలుగా ఎదిగి మాట్లాడటం సరికాదన్నారు. ఇందుకు జెడ్పీ చైర్మన్ బదులిస్తూ తెలంగాణ కోసం ధర్నాలు చేస్తే జైళ్లలో పెట్టించారన్నారు. ఎమ్మెల్యే అరుణ మాట్లాడుతూ ఇది సంక్షేమ వేదికైనందున రాజకీయాలు వద్దని, అవసరం వచ్చినప్పుడు ఎవరేంటో తేల్చుకుందామని ముగించేశారు. -
జవాబు చెప్పాల్సిందే
సాక్షి, మహబూబ్నగర్: ‘అధికారులకు జవాబుదారీతనం లేకుండా పోయింది. మూడేళ్లసంది అడిగేటోళ్లు లేరని ఇష్టానుసారంగా ప్రవర్తించిండ్రు. ఇక నుంచి ప్రజాప్రతినిధులు అడిగే వాటికి కచ్చితంగా సమాధానాలు చెప్పాల్సిందే. ఓట్లేసి గెలిపించిన మమ్మల్ని ప్రజలు అడుగుతున్నరు. వారికి మేం సమాధానం చెప్పుకోవాలి. వచ్చే సమావేశానికి అరకొర సమాచారంతో వస్తే సహించేది లేదు. వారిపై చర్యలు తీసుకుంటా’ అని జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ జిల్లా అధికార యంత్రాంగంపై విరుచుకుపడ్డారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యసేవలు, మహిళా శిశుసంక్షేమానికి చెందిన స్థాయి సంఘాల సమీక్షా సమావేశాలు జరిగాయి. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ అధ్యక్షతన గ్రామీణాభివృద్ధి, విద్య వైద్యానికి సంబంధించిన స్థాయి సంఘాలు జరగగా, వైస్ చైర్మన్ నవీన్కుమార్రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ స్థాయి సంఘం, ధరూరు జెడ్పీటీసీ సభ్యురాలు పద్మమ్మ అధ్యక్షతన స్త్రీ, శిశు సంక్షేమ స్థాయి సంఘం సమీక్షలు జరిగాయి. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశాల్లో సంబంధిత శాఖలకు చెందిన అధికారులపై జెడ్పీటీసీ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అధికారులు సరైన సమాధానాలు చెప్పలేక తడబడ్డారు. అలాగే ఎజెండా కాపీలు సక్రమంగా లేవంటూ జెడ్పీటీసీలు అసహనం వ్యక్తంచేశారు. ఈ విషయమై జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ జోక్యం చేసుకొని అధికారుల తీరుపై మండిపడ్డారు. వచ్చే సమావేశానికి సమాచార లోపం లేకుండా సరిచూసుకోవాలని హితవు పలికారు. బాలబడులను పెంచాల్సిందే.. గ్రామ సంఘాల ద్వారా ఆటపాటలతో బడి ఈడు కంటే ముందు పిల్లలను విద్యావంతులను చేసేందుకు ఉద్దేశించిన బాలబడులను అన్ని మండలాల్లో ఏర్పాటు చేయాలని గ్రామీణాభివృద్ధి స్థాయి సంఘం నిర్ణయించింది. జిల్లాలో ప్రస్తుతం ఏడు మండలాల పరిధిలో 180 బాలబడులలో 2721 మంది పిల్లలున్నారని, వారిని మరింత పెంచాల్సిన అవసరముందని సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన సాక్షరభారత్ స్కూళ్లు ఎక్కడా పనిచేయడం లేదన్నారు. గ్రామాల్లో నిర్మిస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్లకు సంబంధించిన బిల్లులను వెంటనే మంజూరు చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. డ్రిప్ ఇరిగేషన్కు గ్రామసభ తప్పనిసరి... డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలకు సంబంధించి అర్హుల ఎంపిక గ్రామ సభల ఆమోదం తప్పనిసరి చేయాలని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నవీన్కుమార్రెడ్డి అధికారులకు సూచించారు. తన అధ్యక్షతన జరిగిన వ్యవసాయస్థాయి సంఘం సమీక్షా సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మన ఊరు- మన కూరగాయలు కార్యక్రమం ద్వారా రైతులు పండించిన కూరగాయలకు సరైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. ఆధునిక వ్యవసాయంపై రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. స్కూళ్లకు పక్కా భవనాలు... చాలా ప్రభుత్వ పాఠశాలలోమౌలిక సదుపాయాలు కూడా లేవని విద్య, వైద్యసేవల స్థాయి సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో మరుగుదొడ్లు, వాటి నిర్వహణను కచ్చితత్వం చేయాలని డిమాండ్ చేశారు. శిథిలమైన పాఠశాలల భవనాలను రీషెడ్యూల్ చేయాలన్నారు. విద్యాహక్కు చట్టం పక్కాగా అమలు జరిగేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. పీహెచ్సీలలో వైద్యుల కొరత ఉందని, వెంటనే వాటిని భర్తీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రులలో మందులు లేవని, చిన్న జబ్బు చేసినా బయట నుంచి కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఉందన్నారు. సమీక్షలకు డుమ్మా కొట్టిన ఎంపీలు, ఎమ్మెల్యేలు స్థాయి సంఘాలలో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు శుక్రవారం జరిగిన సమీక్షలకు డుమ్మా కొట్టారు. కేవలం ఇద్దరే హాజరయ్యారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్రెడ్డి, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ జనార్ధన్రెడ్డి మాత్రమే హాజరయ్యారు. గ్రామీణాభివృద్ధి స్థాయి సంఘంలో సభ్యుడైన మహబూబ్నగర్ ఎంపీ ఏపీ జితేందర్రెడ్డి, వ్యవసాయ స్థాయి సంఘంలో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు డీకే అరుణ, జి.చిన్నారెడ్డి, ఎనుముల రేవంత్రెడ్డి, విద్య, వైద్య స్థాయి సంఘంలో సభ్యులుగా ఉన్న జూపల్లి కృష్ణారావు, మహిళా, శిశుసంక్షేమ స్థాయి సంఘంలో సభ్యులుగా ఉన్న నాగర్కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్సీలు ఎస్.జగదీశ్వర్రెడ్డి, కె.నాగేశ్వర్, ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్రెడ్డిలు డుమ్మా కొట్టారు. సమావేశాల్లో ఇన్చార్జి జెడ్పీ సీఈఓ నాగమ్మ, పలువురు జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
వైద్యుడు.. మరో దేవుడు
ఎస్వీఎస్ పాథాలజీ సదస్సులో జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ పాలమూరు : వైద్య వృత్తి ఎంతో గొప్పదని, మనిషి ప్రాణాలు కాపాడే వైద్యుడు మరో దేవుడితో సమానమని జిల్లా పరిషత్ చై ర్మన్ బండారి భాస్కర్ అన్నారు. ఎస్వీఎస్ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో పాథాలజీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన వార్షిక సదస్సును ఆయన జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సం దర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ వైద్యులు బాధ్యతాయుతంగా వ్యవహరిం చాలని, ఎవరైనా అనారోగ్యంతో వస్తే త మ పరిధిలోది కాదంటూ పట్టణాల్లోని ఆ సుపత్రులకు పంపడం మానుకోవాలని కోరారు. కనీసం ప్రథమ చికిత్సనైనా నిర్వహించి, రోగికి ధైర్యాన్ని నింపి పంపాలన్నారు. కేవలం డబ్బే ప్రధానంగా కొం దరు వైద్యులు వ్యవహరిస్తున్నారని, వ్య క్తుల ప్రాణాలు కాపాడాల్సిన ఉన్నతమైన బాధ్యత మీదేనన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. డాక్టర్లంతా పట్టణ ప్రాంతాలకు పరిమితం అవుతున్నారని, దీంతో పల్లె ప్రజలకు వైద్యం కరువైందన్నారు. అనంతరం ఎస్వీఎస్ మెడికల్ కళాశాల, ఆసుపత్రి డెరైక్టర్లు కేజే.రెడ్డి, కనకరాజులు పాథాలజీ విభాగంలో సాధించిన పురోగతిని వివరించారు. వేలాది వైద్య వి ద్యార్థులకు బోధనచేసి వారి ఉన్నతికి కారణమైన ప్రొఫెసర్లు డాక్టర్ సువర్ణకుమారి, డాక్టర్ ఐ.వి.రేణుకాదేవి, డాక్టర్ సి.పద్మావతి దేవిలను యాజమాన్యం ఆధ్వర్యంలో మెడల్స్ బహుకరించి సత్కరించారు. అ నంతరం సావనీర్ను ఆవిష్కరించారు. కా ర్యక్రమంలో ఐఏపీఎం రాష్ట్ర అధ్యక్షురాలు ఐ.వి.రేణుకాదేవి, మున్సిపల్ ఛైర్మన్ రాధా అమర్, కౌన్సిలర్ వనజ, ఎస్వీఎస్ మెడిక ల్ కళాశాల రెసిడెంట్ డెరైక్టర్ రాంరెడ్డి, డీన్ రామేశ్వరుడు, ప్రిన్సిపల్ ఆనంద రామారావు, ఐఏపీఎం ప్రతినిధులు డాక్టర్ అనునయి, డాక్టర్ నిత్యానంద పాల్గొన్నారు.