breaking news
attack woman
-
బుల్డోజర్ యాక్షన్.. బీజేపీ నేత కట్టడాల కూల్చివేత
నొయిడా: బుల్డోజర్ చర్యలు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇప్పటిదాకా కమ్యూనల్కు సంబంధించిన కోణంలోనే ఇంతదాకా ఈ తరహా ప్రతిచర్యలు చూశాం. అయితే తాజాగా నోయిడాలో బుల్డోజర్తో అక్రమ కట్టడాలను కూల్చేయడం, అందునా ఆ కట్టడాలు బీజేపీ నేతవి కావడం, ఆదేశాలకు సీఎం యోగి స్వయంగా ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. యూపీ, నొయిడా అధికారులు బీజేపీ యువనేత శ్రీకాంత్ త్యాగికి వ్యతిరేకంగా రంగంలోకి దిగారు. ఓ మహిళను దుర్బాషలాడి, దాడి చేసిన ఘటన, ఆపై అనుచరులతో బెదిరింపులకు దిగినందుకు ఆదివారం అతనిపై గ్యాంగ్స్టర్ యాక్ట్ కింద నేరారోపణలు నమోదు చేశారు. ఇవాళ నొయిడా సెక్టార్-93లోని గ్రాండ్ ఒమాక్సే హౌజింగ్ సొసైటీ వద్ద అతని ఇంటి ఆవరణలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు సంబంధిత అధికారులు. Residents of Grand Omaxe in Noida's Sec 93 celebrate after the demolition of illegal construction by #ShrikantTyagi.#ITVideo #Noida | @arvindojha @Akshita_N pic.twitter.com/E1JWw2GfvG — IndiaToday (@IndiaToday) August 8, 2022 ఈ కట్టడాలకు సంబంధించే స్థానిక ఇంటి ఓనర్లకు, శ్రీకాంత్ మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ మహిళతో శ్రీకాంత్ దారుణంగా వ్యవహరించాడు. ఆమెను దుర్భాషలాడడంతో పాటు దాడి యత్నానికి దిగాడు. ఆ వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఈ లోపు శ్రీకాంత్ అనుచరులు మరోసారి హౌజింగ్ సొసైటీ దగ్గరకు చేరి.. ఆమె అడ్రస్ కావాలంటూ వీరంగం సృష్టించారు. దీంతో వాళ్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం యోగి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం ఉత్తర ప్రదేశ్ అధికారులు, నోయిడా పోలీసులు సంబంధిత స్థలానికి చేరుకుని త్యాగికి చెందిన అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లోని కట్టడాలను కూల్చేశారు. ఆ సమయంలో స్థానికుల కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. సొసైటీకి సంబంధించిన స్థలంలో త్యాగి నిర్మాణాలు చేపట్టడమే ఇందుకు కారణం. బుల్డోజర్ డ్రైవర్ను కీర్తిస్తూ నినాదాలు చేశారు వాళ్లంతా. Shrikant Tyagi- the National Executive Member Kisan Morcha & National Co-Coordinator - Yuva Kisan Samiti allegedly caught on camera for threatening a woman resident of Grand Omaxe sector 93B #Noida. pic.twitter.com/QTwAgK94dd — Utkarsh Singh (@utkarshs88) August 5, 2022 త్యాగికి దెబ్బలు ఇక్కడితోనే ఆగిపోలేదు. నోయిడాలోని భంగెల్ మార్కెట్లో ఉన్న అతని కార్యాలయాల్లో ఇన్కమ్ ట్యాక్స్ తనిఖీలు జరిగాయి.అక్కడ అతనికి 15 షాపులు ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని దుర్వినియోగం చేసినందుకు సైతం కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం గాలింపు కొనసాగుతోంది. ఉత్తరాఖండ్ వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు. పదిహేను బృందాలు అతని కోసం గాలింపు చేపట్టాయి. చివరిసారిగా హరిద్వారా్-రిషికేష్ మధ్య అతని సిగ్నల్ను పోలీసులు ట్రేస్ చేయగలిగారు. అతని ఆచూకీ తెలిపిన వాళ్లకు 25వేల రూపాయల రివార్డు ప్రకటించారు పోలీసులు. బీజేపీ కిసాన్ మోర్చా నేతగా చెప్పుకుంటున్న శ్రీకాంత్ త్యాగి.. గతంలో బీజేపీ పెద్దలతో కలిసి వ్యక్తిగతంగా ఫొటోలు కూడా దిగాడు. అంతేకాదు ఆ ట్యాగ్తోనే దందాలు సైతం నడిపిస్తున్నాడు. ఆగష్టు 5వ తేదీన అతను గ్రాండ్ ఓమాక్సే సొసైటీలో ఓ మహిళతో వాగ్వాదానికి దిగి.. దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడు. గతంలోనూ నోయిడా అథారిటీ అతనికి అక్రమ కట్టడాలపై స్థానికుల ఫిర్యాదు మేరకు నోటీసులు పంపింది. అయితే.. బీజేపీ నేత కావడంతో అధికారులు చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో ప్రస్తుత వివాద నేపథ్యంలో అతను తమ పార్టీ సభ్యుడు కాదంటూ బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది. -
యువతిని కిందపడేసిన అడవిపంది.. వైరల్
బీజింగ్ : అడవి పందిని మీరెప్పుడైనా చూశారా? ఒక వేళ చూసినా అది ఎలా గాయపరుస్తుందోననే విషయం తెలుసా? తెలియకుంటే ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తొలుత ఓ షాపింగ్ మాల్లోకి దూసుకెళ్లిన అడవిపంది అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ప్రయత్నించి విఫలమై చివరకు రోడ్డెక్కింది. అనంతరం తనకు ఎదురుగా ఉన్న ఓ యువతిని.. అనంతరం ఓ వ్యక్తిని బలంగా గుద్దేసి పారిపోయింది. అది ఎలాగో తెలియాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే.. -
యువతిని బలంగా గుద్దిన అడవిపంది..
-
వేటకొడవలితో యువతిపై దాడి
మహిళా హాస్టల్లో యువకుడి ఘాతుకం హైదరాబాద్: ప్రేమించమని ఓ యువతిని ప్రేమోన్మాది కొద్దికాలంగా వేధిస్తున్నాడు. అం దుకు యువతి నిరాకరించడంతో ఆమెను హతమార్చేందుకు నగరానికి వచ్చా డు. యువతి డ్యూటీకి వెళ్లడంతో ఆమె గదిలో ఉన్న మరో యువతిని కొడవలితో నరికిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా ఖాజీపేటకు చెందిన శ్రావణ్ అలియాస్ చరణ్ తన ఊరికే చెందిన సమీపబంధువు చెతన్యను ప్రేమించాలని వెం టపడేవాడు. అందుకు యువతి నిరాకరించడం తో కోపం పెంచుకుని ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. రెండు రోజుల క్రితం నగరానికి వచ్చిన శ్రావణ్ సోమవారం మధ్యాహ్నం యువతి ఉంటున్న హాస్టల్కు వచ్చాడు. చైతన్య తనకు చెల్లి అవుతుందని, ఆమెను పిల వాలని వాచ్మెన్కు చెప్పాడు. చైతన్య డ్యూటీకి వెళ్లిందని చెప్పడంతో ఆమె గదిలోనే ఉండి వచ్చిన తర్వాత హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. వాచ్మెన్ కళ్లుగప్పి నేరుగా చైతన్య ఉండే గదిలోకి వెళ్లాడు. అయితే గదిలో చైతన్య రూంమేట్ మమత ఉంది. తాను వేసిన పథకానికి మమత అడ్డొస్తుందని భావించి తన వెంట తీసుకొచ్చిన వేటకొడవలితో ఆమె తలపై వేటువేశాడు. అతడి నుంచి తప్పించుకుని మమత అరుస్తూ గది నుంచి బయటకు రావడాన్ని గమనించిన హాస్టల్ సిబ్బంది శ్రావణ్ను పట్టుకున్నారు. గాయపడిన మమతను ఆస్పత్రికి తరలించి నిందితుడిని పోలీసులకు అప్పగించారు. మమత స్వస్థలం చిత్తూరు జిల్లా తిరుపతి. ఆమె ఈసీఐఎల్లోని ఓ కంపనీలో ఆర్కిటెక్ట్గా పనిచేస్తోంది. మమత ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని పోలీసులు తెలిపారు.