breaking news
advisory to indians
-
పాక్ పీచమణచేందుకు ముహూర్తం ఖరారు!
న్యూఢిల్లీ/జమ్మూ/ఇస్లామాబాద్: సర్వం సిద్ధమవుతోంది. ముహూర్తం దాదాపుగా ఖరారైంది. సరిహద్దులకు ఆవలివైపు నుంచి ఉగ్ర దాడులను పనిగట్టుకుని ఎగదోస్తున్న దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారాంతంలోపు ఎప్పుడైనా పాక్పై భారీ స్థాయి ‘ఆపరేషన్’ జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సన్నద్ధతను సరిచూసుకునేందుకు బుధవారం పలురకాల మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది. 1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ జరగనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం! అప్పుడు కూడా పాక్తో యుద్ధం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు. డ్రిల్స్లో భాగంగా వాయుదాడుల సైరన్లు మోగించి అప్రమత్తం చేస్తారు. ప్రజలను ఉన్నపళంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతారు. ఈ విషయమై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రణాళికలను తక్షణం అప్డేట్ చేసుకోవాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. డ్రిల్స్లో భాగంగా సమర్థమైన పౌర రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. పహల్గాం ఉగ్ర దాడుల వంటివి జరిగితే దీటుగా ఎదుర్కోవడం ఎలాగో నేర్పిస్తారు. స్వీయరక్షణ చర్యలతో పాటు విద్యుత్ సరఫరా బ్లాకౌట్ వంటివి జరిగితే తక్షణం ఎలా స్పందించాలో, కీలక మౌలిక వనరుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తారు.12వ రోజూ కాల్పులుమరోవైపు పాక్ కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు వరుసగా 12వ రోజూ కొనసాగాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూ కశ్మీర్లో 8 సెక్టా్టర్లలో పాక్ సైన్యం సోమవారం విచ్చలవిడి కాల్పులకు దిగింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరీ, మెంధార్, నౌషేరా, సుందర్బని, అఖ్నూర్ సెక్టార్లలో పాక్ కవ్వింపుల చర్యలకు దీటుగా బదులిచ్చినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్ర దాడులకు ప్రతి చర్యల్లో భాగంగా సింధూ జల ఒప్పందాన్ని పక్కన పెడుతూ ఏప్రిల్ 24న కేంద్రం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఆ వెంటనే నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం ఆగడాలు మొదలయ్యాయి.భేటీలతో బిజీబిజీగా మోదీదేశ రక్షణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కీలక సమీక్షలు నిర్వహించారు. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతి చర్య ఎలా ఉండాలన్నదే వాటి ఏకైక ఎజెండా అని తెలుస్తోంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్కుమార్సింగ్తో ఆయన భేటీ అయ్యారు. సైనిక సన్నద్ధతకు సంబంధించిన పలు అంశాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కొద్ది రోజులుగా త్రివిధ దళాధిపతులతో ప్రధాని ఒక్కొక్కరుగా సమావేశం కావడం తెలిసిందే. పహల్గాంకు బదులు తీర్చుకునే పూర్తి బాధ్యతలను మోదీ వారికే అప్పగించారు.యుద్ధం వద్దు: ఐరాసజనాక్రోశాన్ని అర్థం చేసుకోగలనుదాడులు పరిష్కారం కాదు: గుటెరస్ఐరాస: భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతలు కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వెలిబుచ్చింది. వాటి కట్టడికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఇరు దేశాలకూ సూచించారు. అందుకు దన్నుగా నిలిచేందుకు ఐరాస సిద్ధమని తెలిపారు. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని హితవు పలికారు. సాయుధ ఘర్షణ మొదలైతే పరిస్థితి అదుపు తప్పుతుందని ఆందోళన వెలిబుచ్చారు. ‘‘పహల్గాం ఉగ్ర దాడి అనంతరం భారత్లో పెల్లుబుకుతున్న జనాగ్రహాన్ని, ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలను. ఆ పాశవిక దాడిని మరోసారి ఖండిస్తున్నా. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇలా పౌరులను లక్ష్యం చేసుకోవడం దారుణం. దీనికి పాల్పడ్డవారికి చట్టపరంగా కఠిన శిక్షపడాల్సిందే’’ అన్నారు.అణుయుద్ధం దిశగా పరిస్థితులు: పాక్కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి తమపై భారత్ ఏ క్షణమైనా సైనిక దాడి చేయవచ్చని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆందోళన వెలిబుచ్చారు. ఈ మేరకు తమకు నివేదికలున్నట్టు చెప్పుకొచ్చారు. అదే జరిగితే దీటుగా బదులిస్తామన్నారు. మరోసారి ‘అణు’ పల్లవి వినిపించారు. మోదీ తన రాజకీయ ప్రయోజనాల కోసం దక్షిణాసియాను అణుయుద్ధం వైపు నెడుతున్నారని ఆక్షేపించారు. పాక్లోని ఖైబర్ ఫక్తూన్ఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో భారత్ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. దీనికి, తమపై భారత్ పాల్పడుతున్న ఆర్థిక ఉగ్రవాదానికి 2016, 2017ల్లోనే ఐరాసకు అన్ని ఆధారాలూ సమర్పించామని ఆసిఫ్ చెప్పుకొచ్చారు. ‘‘పహల్గాం ఉగ్ర దాడి కూడా భారత్ పనే. మా ప్రధాని షహబాజ్ షరీఫ్ సూచించినట్టు అంతర్జాతీయ దర్యాప్తు జరిగితే ఆ దాడి మోదీ సర్కారు పనా, లేక భారత్లోని ఏదైనా సంస్థ పనా అన్నది తేలిపోయేది’’ అంటూ అతి తెలివి ప్రదర్శించారు.పాక్ పార్లమెంటు భేటీపాక్ పార్లమెంటు సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. పహల్గాం దాడికి తమను నిందించడాన్ని తీవ్రంగా ఖండించింది. సింధూ జల ఒప్పందం నిలిపివేతను యుద్ధ చర్యగా పేర్కొంది. భారత ప్రతీకార చర్యలను నిరసించింది. కశ్మీరీల స్వయంప్రతిపత్తి పోరుకు మద్దతిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు తీర్మానాలు చేసింది. -
కెనడాలోని భారతీయులకు కేంద్రం హెచ్చరికలు
ఢిల్లీ/ఒట్టావా: కెనడాలో భారత వ్యతిరేక కలాపాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అక్కడి భారతీయులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడ ఉంటున్న భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ తాజాగా ప్రత్యేక మార్గదర్శకాలకు విడుదల చేసింది. కెనడాలో ఉంటున్న భారత పౌరులు, విద్యార్థులకు ప్రత్యేక గైడ్లైన్స్ రిలీజ్ చేసింది భారత విదేశాంగ శాఖ. హింసల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అందులో హెచ్చరించింది. ప్రయాణాలపై ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తూ ప్రత్యేక ట్రావెల్ అడ్వయిజరీని విడుదల చేసింది. అలాగే.. ఆందోళనలు జరిగే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని కోరింది. అంతేకాదు.. కెనడా వెళ్లే భారతీయులూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది కేంద్రం. కెనడా వెళ్లాలనుకునేవాళ్లు.. అవసరమైతే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరింది. మరోవైపు ప్రపంచ దేశాలు కెనడా-అమెరికా వివాదంపై దృష్టిసారించాయి. ఇప్పటికే అగ్రదేశం అమెరికా స్పందన కోరింది కెనడా. అయితే.. అమెరికా మాత్రం ఇంతదాకా స్పందించలేదు. ఖలిస్థానీ సానుభూతిపరుల ఆగడాలతో భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే.ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ (India) హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Canada PM Justin Trudeau) తీవ్ర ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. Advisory for Indian Nationals and Indian Students in Canada:https://t.co/zboZDH83iw pic.twitter.com/7YjzKbZBIK — Arindam Bagchi (@MEAIndia) September 20, 2023 ఇదీ చదవండి: భారత్పై కెనడా ప్రధాని ఆరోపణల వెనక ఆంతర్యం ఇదే! -
‘ఉక్రెయిన్ నుంచి వెంటనే వెళ్లిపోండి’.. భారత పౌరులకు హెచ్చరిక
కీవ్: రష్యాలోని కీలకమైన కెర్చ్ వంతెన పేల్చివేతతో ఉక్రెయిన్పై భీకర దాడులు చేస్తున్నాయి మాస్కో సేనలు. ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడుతుండటంతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా దేశవ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయి. పరిస్థితులు తీవ్రంగా మారడం వల్ల కీవ్లోని ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్లో ఇంకా ఎవరైనా భారత పౌరులు ఉంటే వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని ట్విటర్ వేదికగా వెల్లడించింది. ‘ఉక్రెయిన్లో భద్రతా పరిస్థితులు మరింద దిగజారుతున్నాయి. పెరుగుతున్న దాడుల దృష్ట్యా భారత పౌరులెవరూ ఇక్కడికి రావొద్దు. భారత పౌరులు, విద్యార్థులు ఎవరైనా ఇంకా ఉక్రెయిన్లోనే ఉండి ఉంటే వీలైనంత త్వరగా అందుబాటులోని మార్గాల ద్వారా దేశాన్ని విడిచి వెళ్లండి’ అని భారత రాయబార కార్యాలయం బుధవారం అడ్వైజరీ జారీ చేసింది. ఉక్రెయిన్లోని నాలుగు నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన రష్యా.. బుధవారం అక్కడ మార్షల్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ చట్టానికి భయపడి ఖేర్సన్లో కొంతమంది పడవల్లో ఇతర ప్రాంతాలకు పారిపోతున్నారు. ఈ నాలుగు ప్రాంతాలను యుద్ధ కేంద్రాలుగా చేసుకుని రష్యా తమ దాడులను మరింత పెంచే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది. ఇదీ చదవండి: బ్రిటన్లో తీవ్రమైన సంక్షోభం.. తిండికి దూరంగా లక్షల మంది! -
భారతీయులూ.. వెంటనే వెనక్కి వచ్చేయండి!!
యెమెన్ దేశంలో విపరీతంగా ఘర్షణలు జరుగుతుండటంతో అక్కడున్న భారతీయులంతా వెంటనే స్వదేశానికి వచ్చేయాలని భారత ప్రభుత్వం కోరింది. ఏ రకమైన రవాణా సాధనాలు అందుబాటులో ఉన్నా వెంటనే వాటిని పట్టుకుని వెనక్కి వచ్చేయాలని భారతీయును కోరుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. యెమెన్లో ఉన్న భారతీయుల్లో చాలామంది నర్సింగ్ వృత్తిలోనే ఉన్నారు. వాళ్లంతా పరిస్థితి తీవ్రతను గుర్తించి.. వెనక్కి వస్తారని భావిస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. సుమారుగా అక్కడ 3 వేల నుంచి 3,500 మంది వరకు భారతీయులు ఉంటారన్నారు. యెమెన్ అధ్యక్షుడితో పాటు అక్కడి ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్లపై షియా మిలిషియా వర్గలు దాడులకు తెగబడుతున్నాయి. సనాలో ఉన్న భారతీయ రాయబార కార్యాలయం భారతీయులకు సాయం చేసేందుకు ప్రత్యేకంగా హెల్ప్లైన్లు ఏర్పాటుచేసింది.