breaking news
advertise
-
కంటెంట్ క్రియేటర్ల పీక నొక్కిన యూఏఈ
సోషల్ మీడియా ప్రమోషన్ల కోసం కంటెంట్ క్రియేటర్లందరికీ తప్పనిసరిగా ‘అడ్వర్టైజర్ పర్మిట్’ అవసరమని యూఏఈ మీడియా కౌన్సిల్ ప్రకటించింది. కంటెంట్ క్రియేటర్లు అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ అనుమతి మంజూరు చేస్తామని తెలిపింది. ఈ విధానం త్వరలో అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే కంటెంట్ క్రియేటర్లకు ఈ అనుమతులు మొదటి మూడేళ్లు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపింది. ఆ తర్వాత రెన్యువల్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.క్రియేటర్లు దరఖాస్తు చేసుకున్న తర్వాత వెరిఫై చేసి ప్రభుత్వం వారికి పర్మిట్ నంబర్లను కేటాయిస్తుంది. ఈ పర్మిట్ నంబర్లను కంటెంట్ క్రియేటర్లు తమ అకౌంట్లపై స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. కౌన్సిల్ నుంచి అనుమతులు పొందిన తరువాత మాత్రమే ప్రకటనలు పోస్ట్ చేయాలి. యూఏఈ మీడియా కౌన్సిల్ సెక్రటరీ జనరల్ మొహమ్మద్ సయీద్ అల్ షెహి మాట్లాడుతూ.. ‘అడ్వర్టైజర్ పర్మిట్ అనేది ప్రజా హక్కులను కాపాడుతుంది. కంటెంట్ సృష్టికర్తలు, ప్రకటనదారులు, ప్రేక్షకుల మధ్య బాధ్యతాయుతమైన, వృత్తిపరమైన సంబంధాలను మెరుగుపరుస్తుంది’ అని చెప్పారు. సొంత ఉత్పత్తులు లేదా సర్వీస్ లేదా కంపెనీని ప్రమోట్ చేయడానికి వ్యక్తిగత ఖాతాలను ఉపయోగించే వారికి ఈ నియమం నుంచి మినహాయింపు ఇస్తామని కౌన్సిల్ పేర్కొంది. ఎడ్యుకేషన్, అథ్లెటిక్, సాంస్కృతిక లేదా అవగాహన కార్యకలాపాలలో పాల్గొనే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి ఈ వెసులుబాటు ఉంటుందని చెప్పింది.యూఏఈ మీడియా కౌన్సిల్లో స్ట్రాటజీ అండ్ మీడియా పాలసీ సెక్టార్ సీఈఓ మైతా మజీద్ అల్ సువైది మాట్లాడుతూ.. కౌన్సిల్ ద్వారా లైసెన్స్ పొందిన వ్యక్తులతో మాత్రమే కంపెనీలు, సంస్థలు టైఆప్ కావాలని తెలిపారు. విజిటింగ్ కంటెంట్ క్రియేటర్లు ‘విజిటర్ అడ్వర్టైజర్ పర్మిట్’ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మూడు నెలలు చెల్లుబాటు అవుతుంది. తర్వాత మూడు నెలలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. యూఏఈలో కౌన్సిల్ ఆమోదించిన లైసెన్స్డ్ అడ్వర్టైజింగ్ లేదా టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీల ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహించనున్నారు.భారత్పై ప్రభావం ఎంతంటే..భారత్ కేవలం యూఏఈకి పొరుగు దేశం మాత్రమే కాదు. ఇది దాని డిజిటల్, కల్చరల్ ఎకోసిస్టమ్లో కీలకమైన స్థానంలో ఉంది. యూఏఈ డిజిటల్ టాలెంట్ పూల్లో భారతీయ క్రియేటర్లు, ఫ్రీలాన్సర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు గణనీయమైన భాగం ఉన్నారు. తాజా నిర్ణయంతో యూఏఈ ఆధారిత ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న భారతీయ ఇన్ఫ్లూయెన్సర్లపై ప్రభావం ఉండనుంది. అక్కడ నివసిస్తున్న ఎన్ఆర్ఐలు, భారతీయ ప్రవాసులు కంటెంట్ను సృష్టించడంలో సదరు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. భారతీయ బ్రాండ్లు, ఏజెన్సీలు యూఏఈ ఆధారిత ఇన్ఫ్లుయెన్సర్లతో కలిసి పనిచేయడం లేదా గల్ఫ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ప్రచారాలను నిర్వహించడంలో కొంత ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.మన కంటెంట్ క్రియేటర్లకు కొత్త సవాళ్లుప్రమోషనల్ కంటెంట్పై చెల్లుబాటు అయ్యే ప్రకటనదారు పర్మిట్ నెంబరును పొందాల్సి ఉంటుంది. దీన్ని బహిరంగంగా ప్రదర్శించాలి.కంటెంట్ సృష్టించే స్వల్పకాలిక సృష్టికర్తలు లేదా పర్యాటకులకు యూఏఈ ఆధారిత ఏజెన్సీ స్పాన్సర్షిప్ అవసరం.అన్పెయిడ్ ఎండార్స్మెంట్లు ఇప్పుడు నియంత్రణ పరిధిలోకి వస్తాయి.నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు, ప్లాట్ఫామ్ ఆంక్షలు లేదా నిషేధానికి కూడా దారితీసే అవకాశం ఏర్పడవచ్చు. ఇక్కడా ఇలాంటి నిబంధనలు?ఇన్ఫ్లూయెన్సర్ రెగ్యులేషన్లో భారత్ అడ్వాన్స్గానే ఉంది. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ), వినియోగదారుల రక్షణ చట్టం ఇప్పటికే వీటి అవసరాన్ని హైలైట్ చేశాయి. భారత్లో ఇప్పటికే పెయిడ్ కొలాబరేషన్కు సంబంధించిన వివరాలను స్పష్టంగా వెల్లడించాలి. #ad, #sponsored లేదా #collab వంటి హ్యాష్ట్యాగ్లతో కంటెంట్కు లేబులింగ్ ఇవ్వాలి.యూఏఈ తీసుకున్న నిర్ణయం భారత్లో మరిన్ని నియంత్రణ చర్యలకు దారితీసే అవకాశం ఉంది. తప్పుడు సమాచారం, పెయిడ్ ఎండార్స్మెంట్లు, డిజిటల్ మార్కెటింగ్లో ఆర్థిక పారదర్శకతపై పెరుగుతున్న పరిశీలన, భారత ప్రభుత్వం లేదా నియంత్రణ సంస్థలు లైసెన్సింగ్ నమూనాలను కఠినంగా అమలు చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చు.యూఏఈ అడ్వర్టైజర్ పర్మిట్ రూల్ ప్రయోజనాలుపారదర్శకతవీక్షకులు ప్రమోషనల్ కంటెంట్ను స్పష్టంగా గుర్తించగలరు. మోసపూరిత ప్రకటనల అవకాశాలను తగ్గించవచ్చు. ఇది ఇన్ఫ్లూయెన్సర్లు, ప్రేక్షకుల మధ్య ఎక్కువ నమ్మకాన్ని పెంపొందిస్తుంది.పరిశ్రమపై పక్కా ప్రమాణాలుఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ కోసం ప్రమాణాలను ఏర్పరుస్తుంది. క్రియేటర్లకు వ్యాపార అవకాశాలు అందిస్తుంది.వినియోగదారుల రక్షణముఖ్యంగా ఫైనాన్స్, హెల్త్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే లేదా అప్రకటిత ఎండార్స్మెంట్ల నుంచి రక్షణ లభిస్తుంది. అన్పెయిడ్ ప్రమోషన్లను కూడా నియంత్రిస్తుంది.ప్రభుత్వానికి రెవెన్యూపర్మిట్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఇన్ఫ్లూయెన్సర్ క్యాంపెయిన్లు, బ్రాండ్ కోలాబరేషన్లపై ట్రాకింగ్ ఉంటుంది.ఇదీ చదవండి: ‘టీసీఎస్ నిర్ణయం ప్రమాదకరం’యూఏఈ ప్రకటనతో నష్టాలుచిన్న కంటెంట్ క్రియేటర్లలో నిరుత్సాహంఫ్రీలాన్సర్లు, మైక్రో-ఇన్ఫ్లూయెన్సర్లు, స్పాన్సర్ అవసరాలను నిర్వహించడం కష్టంగా మారుతుంది. కొత్తగా వచ్చేవారిని నిరుత్సాహపరుస్తుంది.యూఏఈ కాని క్రియేటర్లకు..యూఏఐ వెలుపల కంటెంట్ సృష్టికర్తలు (ఉదా. భారతదేశంలో లేదా మరెక్కడైనా) అక్కడి ప్రేక్షకులను ప్రభావితం చేసేందుకు చట్టాలు అడ్డంకిగా మారుతాయి. గ్లోబల్ డిజిటల్ కంటెంట్లో పరిధులు నిర్ధారించినట్లు అవుతుంది.సందర్శకులకు పరిమితులుతాత్కాలికంగా యూఏఈని సందర్శించే సృష్టికర్తలకు (ఉదా.ట్రావెల్ వ్లాగ్లు లేదా ఈవెంట్ల కోసం) పరిమిత అనుమతులుంటాయి. ఇందుకోసం స్థానిక స్పాన్సర్షిప్ అవసరం అవుతుంది. -
రెడిట్ ప్రచారకర్తగా సచిన్ టెండుల్కర్
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫాం రెడిట్కు ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. ఇకపై తన రెడిట్ ప్రొఫైల్ ద్వారా తన అభిప్రాయాలు, మ్యాచ్ల విశ్లేషణ, ఎక్స్క్లూజివ్ కంటెంట్ను ఆయన షేర్ చేస్తారు. అలాగే భారత్తో పాటు ఇతరత్రా మార్కెట్ల కోసం రూపొందించే కొత్త మార్కెటింగ్ ప్రచార ప్రకటనల్లో ఆయన కనిపిస్తారని కంపెనీ వివరించింది. వివిధ వర్గాలందరినీ ఒక చోటికి చేర్చే రెడిట్తో జట్టు కట్టడం సంతోషకరమైన విషయమని టెండుల్కర్ తెలిపారు. శ్రేష్టమైన క్రికెట్కు టెండుల్కర్ పేరు పర్యాయపదమని రెడిట్ వైస్ ప్రెసిడెంట్ దుర్గేశ్ కౌశిక్ వివరించారు. తమ ప్లాట్ఫాంలో క్రీడలపై ఆసక్తి వార్షికంగా 30 శాతం పెరగడంతో స్పోర్ట్స్ కంటెంట్కి మరింత ప్రాధాన్యం ఇవ్వడం మీద రెడిట్ దృష్టి పెడుతోంది. ఈ మధ్యే ఇటాలియన్ ఫుట్బాల్ లీగ్ సిరీ ఏ, గతేడాది ఎన్ఎఫ్ఎల్, ఎన్బీఏ, ఎంఎల్బీ తదితర అమెరికన్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ లీగ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. -
జోరుగా వినోద, మీడియా రంగం
న్యూఢిల్లీ: భారత వినోద, మీడియా రంగం స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. 2018 కల్లా ఈ రంగం రూ.2.27 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని సీఐఐ-పీడబ్ల్యూసీ నివేదిక వెల్లడించింది. ప్రకటనలు, టీవీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన వృద్ధి దీనికి కారణమని ఈ నివేదిక పేర్కొంది. ఇండియా ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా అవుట్లుక్ 2014 పేరుతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ), ప్రైస్వాటర్కూపర్స్(పీడబ్ల్యూసీ) రూపొందించిన నివేదిక ముఖ్యాంశాలు.. 2013లో భారత వినోద, మీడియా రంగం టర్నోవర్ రూ.1.12 లోల కోట్లని అంచనా. 2013-18 కాలానికి 15 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుందన్నది నివేదిక అంచనా. టెలివిజన్ పరిశ్రమలో వృద్ధి జోరు కొనసాగుతుంది. చందా ఆదాయాలు భారీగా పెరిగే అవకాశాలుండడమే(ఏడాదికి 15 శాతం వృద్ధి) దీనికి ఒక కారణం. ఇంటర్నెట్ అందుబాబులోకి రావడం, ఇంటర్నెట్లో ప్రకటనల ఆదాయం.. వీటి జోరు బాగా ఉంది. మొదటిది 47 శాతం, రెండోది 26 శాతం చొప్పున వార్షిక వృద్ధిని సాధిస్తాయి. భవిష్యత్తు అంతా డిజిటల్ మీడియాదే. 2013లో రూ.35,000 కోట్లుగా ఉన్న ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం 2018 నాటికి 13% చక్రగతి వృద్ధితో రూ.60,000 కోట్లకు పెరుగుతుంది. {పింట్ మీడియాను ఇంటర్నెట్ అధిగమిస్తుంది. {పకటనల ఆదాయం అధికంగా టీవీ, ప్రింట్ మీడియాలకే అందుతుంది. 2013 నాటికి రూ.12,600 కోట్లుగా ఉన్న చిత్ర పరిశ్రమ టర్నోవర్ 12 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుంది. దేశీయంగా, విదేశాల్లో కూడా సినిమా హాళ్ల ద్వారానే కాకుండా కేబుల్, శాటిలైట్ రైట్స్ ఆదాయం కూడా పెరుగుతుంది. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్ల వినియోగం పెరుగుతుండడంతో గేమింగ్ రంగం ఆదాయం కూడా పెరుగుతుంది. -
బెంగాల్ ప్రభుత్వ ప్రకటనలపై జాగ్రత్త
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటనలు తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) తన సభ్యులకు సూచించింది. ఐఎన్ఎస్ కార్యవర్గ కమిటీ సోమవారమిక్కడ సమావేశమైంది. తన సభ్య పత్రికలకు కొన్నింటికి ప్రభుత్వం చాలా ఏళ్లుగా ప్రకటనల బిల్లులు చెల్లించకపోవడంపై కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా పరిశ్రమ ఇప్పటికే కష్టాల్లో ఉన్న నేపథ్యంలో బిల్లుల డబ్బులు రాక ఈ పత్రికలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. ముఖ్యమంత్రి వెంటనే బకాయిలు చెల్లించాలని కార్యవర్గం కోరినట్లు ఐఎన్ఎస్ ప్రధాన కార్యదర్శి వి.శంకరన్ ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇక ఏటీఎంలలో ప్రకటనలు..!
న్యూఢిల్లీ: ఏటీఎంల వద్ద భద్రత తప్పకుండా పెంచా ల్సిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇందుకయ్యే వ్యయాలను సమీకరించుకునేందుకు బ్యాంకులు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా ఏటీఎంలలో కూడా ప్రకటనలు ఉంచడం, విత్డ్రాయల్ చార్జీలు పెంచడం వంటి అంశాలను పరిశీలిస్తున్నాయి. బెంగళూరు ఏటీఎంలో ఒక మహిళపై ఉన్మాది దాడి ఉదంతంతో ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ సెంటర్లలో భద్రత చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీంతో వీటిలో సెక్యూరిటీని తప్పనిసరిగా ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. గతేడాది నవంబర్ ఆఖరు నాటి లెక్కల ప్రకారం మొత్తం 1.40 లక్షల ఏటీఎంలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీటన్నింటిలో నిఘా కెమెరాలు (లోపల, బైట), సమీప పోలీస్ స్టేషన్ని అప్రమత్తం చేసేలా అలారమ్లు మొదలైనవి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే సుశిక్షితులైన సెక్యూరిటీ గార్డులను కూడా నియమించాలి. ఇంత భారీస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడమన్నది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే, బ్యాంకులు ఇందుకు నిధులు సమీకరించుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. బీమా, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు మొదలైన వాటి ప్రకటనలను ఏటీఎంలలో ప్రదర్శించడం ద్వారా కొంత మేర ఆదాయం సమకూర్చుకోవచ్చని బ్యాం కులు భావిస్తున్నాయి. ఇక ఉచిత లావాదేవీల సంఖ్యను కూడా తగ్గించాలని యోచిస్తున్నాయి. సొంత బ్యాంకు ఏటీఎంలలో సైతం ఉచిత లావాదేవీలను ఐదుకు పరిమితం చేయడంపైనా బ్యాంకులు దృష్టి సారిస్తున్నాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంలు వాడితే తప్ప ప్రస్తుతం సొంత బ్యాంకు ఏటీఎం లావాదేవీలపై ఎలాంటి పరిమితీ లేదు. మరోవైపు, ఇతర బ్యాంకుల ఏటీఎంలను పరిమితికి మించి వాడితే విధించే సర్వీస్ చార్జీలను కూడా రూ. 15 నుంచి రూ. 18కి పెంచడాన్నీ బ్యాంకులు పరిశీలిస్తున్నాయి. దీంతో పాటు ఏటీఎం-కమ్-డెబిట్ కార్డుల వార్షిక మెయింటెనెన్స్ ఫీజులనూ పెంచాలని యోచిస్తున్నాయి.