breaking news
adulterate
-
హైదరాబాద్లో కల్తీ డ్రై ఫ్రూట్స్ విక్రయం.. వ్యాపారి అరెస్ట్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్లో కల్తీ డ్రై ఫ్రూట్స్ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చార్మినార్లోని జెమ్ ఫుడ్స్ గోడౌన్పై పోలీసులు దాడి చేశారు. అక్కడ నిల్వ ఉంచిన 30 బాక్సులకు పైగా కుళ్లిపోయిన డ్రై ఫ్రూట్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మనీష్ అనే డ్రై ఫ్రూట్స్ వ్యాపారి బూజు పట్టిన జీడిపప్పు, బాదంలను నాణ్యమైనవిగా చూపించి ప్రజలకు విక్రయిస్తున్నాడు. దాంతో ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినందుకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కాగా డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేసే సమయంలో వాటి నాణ్యతను పరిశీలించాలని సూచించారు. ఈ ఘటనతో కల్తీ ఆహార పదార్థాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
పెట్రోల్ కల్తీని నివారించండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా పెట్రోల్ బంకుల్లో భారీగా కల్తీ జరుగుతోందని సుప్రీంకోర్టు పేర్కొంది. పెబ్రోల్ బంకుల్లో జరుగుతున్న కల్తీని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది. ఎటువంటి చర్యలు చేపట్టారో ఆరు వారాల్లోగా తెలపాలని సూచించింది. చమురు కల్తీకి ఆస్కారం లేని పెట్రోల్, డీజిల్ అమ్మకపు యంత్రాలు తయారు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరింది. పెట్రోల్లో కిరోసిన్ కలుపుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన సదాబాద్ ఎమ్మెల్యే దేవేంద్ర అగర్వాల్ పై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.


