బెగులూర్ను సందర్శించిన అడిషనల్ హెల్త్ డైరెక్టర్
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం బెగులూర్ను అడిషినల్ హెల్త్ డైరెక్టర్ ఆఫ్ మలేరియా, ఫైలేరియా వైద్యులు ప్రభావతి గురువారం సందర్శించారు. జ్వరాలతో మృతి చెందిన lవారి గురించి ఆరా తీశారు. పారిశుధ్యలోపంతోనే జ్వరాలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర కన్సల్టెంట్ సంజీవరెడ్డి, సైదులు, క్లస్టర్ ఎస్పీహెచ్వో సమియెుద్దీన్, ఎస్వీవో నాగిరెడ్డి, హెచ్ఈవో రమేశ్, మలేరియా, హెల్త్సూపర్వైజర్లు లార్వాలను నిర్మూలించడంలో పాల్గొన్నారు.