breaking news
achampet constituency
-
అచ్చంపేట: త్రిముఖ పోరు.. గెలుపు ఎవరిది?
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎస్సీ నియోజకవర్గంగా అచ్చంపేటలో ఈసారీ త్రిముఖపోటీ అనివార్యం కానుంది. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలే ప్రధాన ఎజెండాగా అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముందుకెళ్తుండగా ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతతో పాటు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం తమకు కలిసి వస్తుందని కాంగ్రేస్ భావిస్తుంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ది గువ్వల బాల్రాజు విజయం సాధించారు. ఆయన రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్ది డాక్టర్ వంశీకృష్ణను ఓడించారు. ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ప్రభుత్వ విప్గా కొనసాగుతున్న గువ్వల బాల్రాజు మూడోసారి అచ్చంపేట నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కాని ఆయన వ్యవహారశైలిపై సొంతపార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్లు, పార్టీ కార్యకర్తల పట్ల దురుసుగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు తప్పా కొత్తగా తన మార్కు పనులు ఏమీ చేయలేదనే ప్రచారం ఉంది. నియోజకవర్గ సమగ్ర అభివృద్ది కోసం ప్రాధాన్యత ఇవ్వలేదని, ప్రధానంగా ఏజేన్సీ ప్రాంతం అధికంగా ఉన్న అమ్రాబాద్ మండలంలో సాగునీటి సమస్య తీరలేదు. అక్కడ వేలాది మంది రైతులకు చెందిన పోడు భూముల వ్యవహారం కొలిక్కి రాలేదు. దీనికి తోడు ఆయనపై పోడు రైతులు గుర్రుగా ఉన్నారు. బల్మూరు, లింగాల మండలాలకు సాగునీరు అందిస్తామన్న హామీ నేటికి నెరవేరలేదు. పలు మండలాల్లో టీఆర్ఎస్ పార్టీకి కొందరు నేతలు కూడ ఎమ్మెల్యే వైఖరితోనే దూరమవుతున్నారని సొంతపార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. పార్టీ సీనియర్లు, కార్యకర్తలు ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్నా ఆ విషయాన్నిఆయనకు చెప్పే ధైర్యం చేయటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. భూ వివాదాల్లో కూడా తలదూర్చుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకునియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం కూడా ఇవ్వలేదు. ఇళ్లస్దలాలు ఇవ్వలేదు. మాదిగా సామాజిక వర్గానికి చెందటం ఆయనకు కలిసి వచ్చే అవకాశంగా ఉంది. ఫాంహౌజ్ ఎపిసోడ్లో గువ్వల బాల్రాజ్ కూడ ఉండటంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అచ్చంపేట ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ చక్కర్లు కొట్టడం గువ్వలకు ఇబ్బందిగా మారింది. రంగంలోకి ఎంపీ కొడుకు భరత్ ప్రసాద్? అయితే బాల్రాజ్ పక్కన పెడితే నాగర్ కర్నూల్ ఎంపీ రాములుకు సీటు ఇవ్వొచ్చని ఒకవేళ ఆయన వయస్సు మీదపడిందని భావిస్తే ఆయన కుమారుడు భరత్ ప్రసాద్ను రంగంలోకి దించే అవకాశం ఉంది. భరత్ ప్రసాద్కు నాగర్ కర్నూల్ జడ్పి చైర్మన్కి బరిలో నిలిచి చేజాయిరిపోయింది. దానికి ఎమ్మెల్యే గువ్వల బాల్రాజే కారణమని ఆరోపిస్తున్న భరత్ ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట నుంచి బీఆర్ఎస్ సీటు ఆశిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో భరత్ ప్రసాద్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. గతంలో అచ్చంపేట ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రస్తుతం ఎంపీగా తన తండ్రి రాములుకు నియోజకవర్గంలో ఉన్న మంచిపేరు కలిసివస్తుందని భావిస్తున్నారు. పార్టీ సీటు ఇవ్వకుంటే స్వతంత్రంగానైనా బరీలో దిగాలనే ఆలోచనలో భరత్ ప్రసాద్ ఉన్నట్టు సమాచారం. దీంతో అధికార బీఆర్ఎస్లో నెలకొన్న గ్రూపు రాజకీయాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా మూడుసార్లు ఓడిన డాక్టర్ వంశీకృష్ణ మరోసారి పోటీకి సిద్దమవుతున్నారు. ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న వంశీకృష్ణ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు,ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సొంత గ్రామం కూడ అచ్చంపేట నియోజకవర్గంలో ఉండటంతో దీనిపై రేవంత్రెడ్డి కూడ ప్రత్యేక దృష్టి సారించారు.ఈసీటు తప్పకుండా గెలవాలనే యోచనలో ఉన్నారు.ఎమ్మెల్యే గువ్వలబాల్రాజ్ భూకబ్జాలు,ఇసుక అక్రమ రవాణకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదని మండిపడుతున్నారు. గతంలో పార్టీని వదిలిన నేతలు సైతం తిరిగి సొంతగూటికి వస్తున్న నేపధ్యంలో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే వంశీకృష్ణ భార్య,అమ్రాబాద్ జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ అనురాధను రంగంలోకి దింపితే గెలుపు మరింత సులభమవుతుందనే అభిప్రాయం పార్టీ నేతలు,కార్యకర్తల్లో ఉంది.అయితే మాల సామాజిక వర్గానికి చెందిన వంశీకృష్ణకు మాదిగసామాజిక వర్గ ఓట్లు మైనస్గా మారే అవకాశం ఉంది. బీజేపీ నుంచి ఆ ఇద్దరిలో ఎవరూ? బీజేపీ కూడ ఈసారి గెలుపుపే ద్యేయంగా పనిచేయాలని యోచిస్తోంది. బలమైన అభ్యర్దిని రంగంలోకి దింపాలని చూస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన సతీష్ మాదిగ, శ్రీకాంత్ భీమా పేర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నేతలు ఎవరు, వారు చర్యలు ప్రారంభించింది.మిగితా బీఎస్పీ,వైఎస్ఆర్టీపీ పార్టీల అభ్యర్దులు పోటీకి ఆసక్తి చూపుతున్నా వారి ప్రభావం నామమాత్రమే కానుంది. నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు: నియోజకవర్గంలో 80 శాతం ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. పరిశ్రమలు లేవు అడవి విస్తీర్ణం బాగా ఉంటుంది. నియోజకవర్గంలోనే నల్లమలలో దట్టమైన అడవులు ఉన్నాయి. చిరుతలు పెద్దపులులు ఇతర వన్యప్రాణులకు నిలయం నల్లమల్ల. ఉమామహేశ్వర క్షేత్రం, నిరంజన్ షావాలి దర్గా, మద్దిమడుగు, లొద్ది మల్లయ్య, తెలంగాణ అమర్నాథ్గా పలిచే సలేశ్వరం, మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు ప్రసిద్ధిగాంచినవి.అనేక కిలోమీటర్ల పరిధిలో దుందుభినది విస్తరించి ఉంది. ఎస్ఎల్బీసీ నక్కలగండి సాగునీటి ప్రాజెక్టులు పనులు నడుస్తున్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో జంగల్ సఫారీ పేరుతో పర్యాటకులను ప్రత్యేకమైన వాహనంలో అడవిలో పర్యటింప చేస్తున్నారు. కే ఎల్ ఐ కాలువ విస్తీర్ణం నియోజకవర్గం లో అధికంగా ఉంది రైతులకు కొంతమేర లబ్ధి జరుగుతుంది. -
పాలమూరులో ‘దేశం’ కనుమరుగు
మహబూబ్నగర్: మహబూబ్నగర్ రాజకీయ ముఖ చిత్రం నుంచి టీడీపీ క్రమంగా కనుమరుగవుతోంది. ముఖ్యనేతలు, క్రియాశీల కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్తుండటంతో ఆ పార్టీ ఉక్కిరి బిక్కిరవుతోంది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా చోట్ల పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. పోటీలో ఉన్నా చాలా చోట్ల ఉనికి కోసమే నామినేషన్లు వేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎల్కొటి ఎల్లారెడ్డి (నారాయణపేట), జైపాల్ యాదవ్ (కల్వకుర్తి) పార్టీని వీడి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, అచ్చంపేట నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నా ద్వితీయశ్రేణి నాయకత్వం మూకుమ్మడిగా ఇతర పార్టీల్లో చేరింది. షాద్నగర్, నాగర్కర్నూలు, కొల్లాపూర్, ఆలంపూర్, మహబూబ్నగర్లో కనీసస్థాయి నాయకత్వం కూడా లేకుండా పోయింది. కల్వకుర్తి నగర పంచాయతీలో కేవలం ఒక వార్డులో మాత్రమే పార్టీ అభ్యర్థి బరిలో ఉండడం తెలుగుదేశం పరిస్థితికి అద్దం పడుతోంది. బీజేపీతో ఎన్నికల అవగాహన ఉంటుందనే వార్తలతో.. ఇక ఈ పార్టీలో ఉన్నా భవిష్యత్ లేదనే భావన పార్టీ కేడర్లో కనిపిస్తోంది. * షాద్నగర్ నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఉన్నా నాయకులు తీవ్ర అసంతృప్తితో వున్నారు. 2009లో ఎన్నికల అవగాహనలో భాగంగా టీఆర్ఎస్కు కేటాయించారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తు కుదిరితే టీడీపీ పోటీలో ఉండే అవకాశం లేదు. ఒక వేళ టీడీపీ పోటీ చేస్తే తమకే టికెట్ ఇవ్వాలని బీసీ నేతలు పట్టుపడుతున్నారు. * నారాయణపేటలో ఎమ్మెల్యే ఎల్కోటి ఎల్లారెడ్డి ఇటీవలే పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఓ ప్రైవేటు ఆస్పత్రి యజమాని రాజేందర్రెడ్డి ఇన్చార్జిగా ఉన్నా పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. * మక్తల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే దయాకర్రెడ్డి ఉన్నా ఆయన రాజకీయ భవిష్యత్పై కేడర్లో అయోమయం నెలకొంది. ఎమ్మెల్యే ఎల్లారెడ్డి టీఆర్ఎస్ నుంచి మక్తల్లో పోటీ చేస్తారనే వార్తలతో టీడీపీ నుంచి ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయి. * జడ్చర్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పార్టీ కేడర్ను పట్టించుకోవడం లేదు. దీంతో మూకుమ్మడిగా టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీఆర్ఎస్లోకి వలస వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల్లో మెజారిటీ శాతం టీడీపీ నుంచి వలస వచ్చిన వారే కావడం గమనార్హం. * ఎమ్మెల్యే రేవంత్రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తున్నారు. రేవంత్రెడ్డి ఒకవేళ మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తే ఆయన సోదరుడు తిరుపతిరెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించే యోచనలో వున్నారు. * కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పార్టీని వీడటంతో పార్టీ తరపున అటు మున్సిపల్, ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు కూడా అభ్యర్థులు కరువయ్యారు. కల్వకుర్తి నగర పంచాయతీలో 20 వార్డులకు గాను ఒక్కరు మాత్రమే టీడీపీ నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు నామమాత్రంగా పోటీ ఇచ్చే అభ్యర్థులకు బీ ఫారాలు జారీ చేశారు. * నాగర్కర్నూల్లో సీనియర్ ఎమ్మెల్యే నాగం జనార్దన్రెడ్డి, ఉపఎన్నికలో పోటీ చేసిన మర్రి జనార్దన్రెడ్డి పార్టీని వీడటంతో చెప్పుకోదగిన నాయకత్వం లేదు. * అచ్చంపేటలో ఎమ్మెల్యే రాములు పార్టీని వీడుతున్నారనే ప్రచారం పార్టీ శ్రేణులపై ప్రభావం చూపుతోంది. నాగర్కర్నూలు లోక్సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రాములు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. * కొల్లాపూర్లో డాక్టర్ శ్రీనివాస్ పార్టీ బాధ్యతలు చూస్తున్నా కింది స్థాయిలో పటిష్టంగా లేకపోవడంతో సాధారణ ఎన్నికల్లో నామమాత్ర పోటీకి పరిమితమయ్యే అవకాశం వుంది. * వనపర్తిలో ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్రెడ్డికి తెలంగాణ మేనిఫెస్టో కమిటీ బాధ్యతలు అప్పగించారు. ఈసారి తాను ఎన్నికల బరి నుంచి తపుకుని ద్వితీయ శ్రేణి నాయకుడిని ఒకరికి ఎమ్మెల్యే టికెట్ అప్పగిస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. * అలంపూర్లో పార్టీ ఇంచార్జి ఆంజనేయులు ఉన్నా ఆర్ధికంగా లేకపోవడంతో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నామమాత్ర పోటీకే పరిమితమవుతోంది. * దేవరకద్రలో ఎమ్మెల్యే సీతమ్మ పార్టీ కార్యక్రమాల్లో మొక్కుబడిగా పాల్గొంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున ఇతర పార్టీల్లోకి వలస వెళ్లింది. * గద్వాలలో మాజీ మంత్రి డీకే సమర సింహారెడ్డి తన రాజకీ య అనుభవంతో పార్టీని నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. * మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన రాజేశ్వర్గౌడ్ టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. మున్సిపాలిటీ, స్థానిక సంస్థల్లో అభ్యర్థులను నిలిపేందుకు పార్టీ నేతలు తంటాలు పడి అక్కడక్కడా అభ్యర్థులను బరిలోకి దింపారు.