అందువల్లే బీజేపీ గెలిచిందనుకుంటే పొరపాటే! | UP win not because of note ban, says Shiv Sena | Sakshi
Sakshi News home page

అందువల్లే బీజేపీ గెలిచిందనుకుంటే పొరపాటే!

Mar 12 2017 8:18 PM | Updated on Mar 29 2019 9:31 PM

అందువల్లే బీజేపీ గెలిచిందనుకుంటే పొరపాటే! - Sakshi

అందువల్లే బీజేపీ గెలిచిందనుకుంటే పొరపాటే!

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ విజయంపై ఆ పార్టీ మిత్రపక్షం శివసేన స్పందించింది.

ముంబై: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ విజయంపై ఆ పార్టీ మిత్రపక్షం శివసేన స్పందించింది. రుణాలు మాఫీ చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతులకు హామీ ఇవ్వడం వల్లే యూపీలో బీజేపీ గెలిచిందని శివసేన వ్యాఖ్యానించింది. రుణమాఫీ హామీ వల్ల వచ్చిన ఫలితమే ఈ ఎన్నికల విజయమని, దీనిని పెద్దనోట్ల రద్దుకు లభించిన ఆమోదంగా కమలనాథులు భావించరాదని వ్యాఖ్యానించింది.

పేరుకు మిత్రపక్షాలైన బీజేపీ-శివసేన మధ్య ప్రస్తుతం అంతంతమాత్రంగానే సంబంధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర స్థానిక మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీచేశాయి. ఈ నేపథ్యంలో వీలు చిక్కినప్పుడల్లా బీజేపీపై శివసేన విమర్శలు సంధిస్తున్నది. యూపీలో విస్తారమైన ప్రచారం చేయడం వల్లే పొరుగున ఉన్న ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీకి లాభించిందని, ఇక పంజాబ్‌లో అధికార బీజేపీ-అకాలీదళ్‌ కూటమి మట్టికరిచిందని శివసేన అధికార పత్రిక 'సామ్నా' తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. మనోహర్‌ పారికర్‌లాంటి బడా నేత ఉన్నప్పటికీ గోవాలో బీజేపీ 15 స్థానాలు కూడా గెలుచుకోలేకపోయిందని నిశిత విమర్శలు గుప్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement