16న సీఎం కార్యాలయం ముట్టడి | muncipal employees agitation will go forward in ap | Sakshi
Sakshi News home page

16న సీఎం కార్యాలయం ముట్టడి

Jul 12 2015 8:10 PM | Updated on Oct 16 2018 6:35 PM

ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికుల సమ్మె మరింత ఉధృతం కానుంది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికుల సమ్మె మరింత ఉధృతం కానుంది. మంత్రులు నారాయణ, యనమల రామకృష్ణుడుతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో కార్మికులు ఉద్యమ రూపాన్ని మారుస్తూ ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. పుష్కరాల విధులను బహిష్కరిస్తామని మున్సిపల్ కార్మిక జేఏసీ నేత ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.

సోమవారం అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడిస్తామని చెప్పారు. ఇక 14, 15 తేదీల్లో మున్సిపల్ కార్యాలయాల వద్ద రిలే దీక్షలు చేస్తామని స్పష్టం చేశారు. 16న విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఉమామహేశ్వరరావు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement