భూకంప జోన్ పరిధిలోనే రాజధాని | Earthquake Engineering Research Center says, ap capital in earthquake zone | Sakshi
Sakshi News home page

భూకంప జోన్ పరిధిలోనే రాజధాని

Jul 27 2015 11:38 AM | Updated on Sep 3 2017 6:16 AM

భూకంప జోన్ పరిధిలోనే రాజధాని

భూకంప జోన్ పరిధిలోనే రాజధాని

నవ్యాంధ్ర రాజధాని భూకంప తీవ్రత కలిగిన జోన్ పరిధిలోనే ఉందని ఐఐఐటీ హైదరాబాద్ ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ విభాగాధిపతి ఫ్రొఫెసర్ రామచర్ల ప్రదీప్‌కుమార్ చెప్పారు.

- నిర్మాణాలు విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలి -నేపాల్ అంత తీవ్రత లేకున్నా జాగ్రత్తలు అవసరం
- రాజీపడితే భారీ మూల్యం
- ఐఐఐటీ హైదరాబాద్ ఎర్త్ క్వేక్ ఇంజనీరింగ్ రిసెర్చ్ సెంటర్ అధిపతి ప్రదీప్‌కుమార్

 
హైదరాబాద్ : నవ్యాంధ్ర రాజధాని భూకంప తీవ్రత కలిగిన జోన్ పరిధిలోనే ఉందని ఐఐఐటీ హైదరాబాద్ ఎర్త్ క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ విభాగాధిపతి ఫ్రొఫెసర్ రామచర్ల ప్రదీప్‌కుమార్ చెప్పారు. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా రాజధాని నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించి భూకంప తీవ్రతను తట్టుకునే విధంగా వాటిని తీర్చిదిద్దాలని ఆయన అభిప్రాయపడ్డారు. నగరంలో జరిగిన ఒక సదస్సుకు హాజరైన ప్రదీప్‌కుమార్‌తో సాక్షి ముచ్చటించింది. ఆ వివరాలు ఆయన మాటల్లోనూ .....
 
 సాక్షి : ఇటీవల ప్రపంచ వ్యాపితంగా భూకంపాల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.?
 ప్రదీప్ : అవును. పర్యావరణ పరిస్థితులు భూకంపాలను సష్టిస్తున్నాయి. ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తాయని ముందుగా అంచనా వేసినా అందుకు తగిన విధంగా నిర్మాణాలు లేకపోవడం వలన నష్టం అధికంగా ఉంటుంది.
 
 సాక్షి : నవ్యాంధ్ర రాజధాని కష్ణా తీరం భూకంపాల జోన్‌లో ఉందా?
 ప్రదీప్ : కృష్ణా తీరమైన విజయవాడ పరిసరాలన్ని భూకంపాల జోన్-3లో ఉన్నాయి. నూతన రాజధానిలో భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. అయితే జోన్-4, జోన్-5, జోన్-6 ఇలా  భూకంపాల తీవ్రత కలిగిన ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. వాటితో పోల్చితే ఇక్కడ అంత భారీ ప్రభావం ఉండదు.
 
 సాక్షి : ఇటీవల నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది కదా...?
 ప్రదీప్ : అవును. అయితే నేపాల్ సరిహద్దు ప్రాంతాలైన కాశ్మీర్ జోన్-5లో ఉంది.
 
 సాక్షి :నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరుగుతుంది కాదా. దానిపై భూకంపాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది.?
 ప్రదీప్ : జోన్-5 కన్నా అత్యధిక తీవ్రత కలిగిన టోక్యో, కాలిఫోర్నియా వంటి ప్రాంతాల్లోనే భూకంపాలు తట్టుకునే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటి ఇంజనీరింగ్ విధానాలను ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాలి. దానివలన భూకంపాలను ఎదుర్కొనేందుకు అవకాశముంటుంది.
 
 సాక్షి : ఏ విధమైన చర్యలు చేపట్టాలి?
 ప్రదీప్ :అంతర్జాతీయ ప్రమాణాల్లో భాగంగా ఐఎస్1893 (కెరిటెరియ ఫర్ ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ ఆఫ్ స్ట్రెక్చర్) బుక్ ప్రమాణాలను అనుసరించాలి. అలాగే పీర్‌రివ్యూ కమిటీ నిరంతరం పరిశీలించాలి. ఈ కమిటీ రెండు సంవత్సరాల కొకసారి మారుతుంది. దానివలన నిర్మాణాలను వివిధ రకాలుగా ఆయా రంగాల నిపుణులు పరిశీలిస్తారు. దీనివలన మంచి నిర్మాణాలు వస్తాయి.
 
 సాక్షి : భారీ బహుళ అంతస్తుల  భవనాలను నమూనాలుగా చూపిస్తున్నారు. వాటిపై భూకంపాల ప్రభావం ఉండదా?
 ప్రదీప్ : ఆర్కిటెక్చర్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా స్ట్రెక్చరల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలి. దాని వలన మేలు జరుగుతుంది. ఏది ఏమైనా ప్రమాణాల విషయంలో రాజీ పడితే మూల్యం చెల్లించక తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement