'నష్టపోయిన రైతులకు.. రెట్టింపు పరిహారం' | Double compensation to loss of crop farmers: Bandaru dattatreya | Sakshi
Sakshi News home page

'నష్టపోయిన రైతులకు.. రెట్టింపు పరిహారం'

Apr 15 2015 3:54 PM | Updated on Sep 3 2017 12:20 AM

'నష్టపోయిన రైతులకు.. రెట్టింపు పరిహారం'

'నష్టపోయిన రైతులకు.. రెట్టింపు పరిహారం'

పంట నష్టపోయిన రైతులకు గతంలో కంటే రెట్టింపు పరిహారం చెల్లించి ఆదుకుంటామని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు.

కరీంనగర్: పంట నష్టపోయిన రైతులకు గతంలో కంటే రెట్టింపు పరిహారం చెల్లించి ఆదుకుంటామని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. బుధవారం ఆయన కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల డివిజన్లో పంట నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఉన్న నిబంధనలను కేంద్రం సడలించినట్టు చెప్పారు.

అలాగే 30శాతం పంట నష్టాపోయిన రైతులకు కొత్త నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని దత్తాత్రేయ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement