తన మానభంగం చేశాడని తప్పుడు కేసు నమోదు చేసిన కేసులో ఓ యోగా టీచర్ కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది.
అత్యాచారం కేసులో 75 ఏళ్ల యోగా టీచర్ కు విముక్తి
Nov 1 2013 5:33 PM | Updated on May 29 2019 2:59 PM
తనపై అత్యాచారం చేశాడని తప్పుడు కేసు నమోదు చేసిన కేసులో ఓ యోగా టీచర్ కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. తనపై అత్యాచారం చేశాడని 75 ఏళ్ల యోగా టీచర్ పై విద్యార్థిని తప్పుడు ఫిర్యాదు చేసిందని కోర్టు విచారణలో తేలింది.ఈ కేసును విచారించిన అడిషనల్ సెషన్ కోర్టు న్యాయమూర్తి నివేదిత అనిల్ శర్మ విచారించి యోగా టీచర్ ను నిరపరాధిగా వదిలివేశారు.
దక్షిణ ఢిల్లీకి చెందిన సీనియర్ సిటిజన్ కు విద్యార్థినికి ఎలాంటి శారీరక సంబంధం లేదని.. పెళ్లి చేసుకుంటానని కూడా యోగా టీచర్ చెప్పలేదని.. కేవలం టీచర్ పై విద్వేషం పెంచుకొని తప్పుడు ఫిర్యాదు చేసిందని కోర్టు తీర్పులో వెల్లడించింది. అంతేకాక తాను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు సమర్పించడంలో విద్యార్థిని విఫలమైందన్నారు.
2011 ఫిబ్రవరిలో యోగా నేర్చుకోవడానికి వచ్చి యోగా టీచర్ నివాసంలో 15 రోజులపాటు ఉందని..ఆతర్వాత జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో క్లాసులకు హాజరైందని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement