ఇద్దరు రైతుల బలవన్మరణం

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/జగిత్యాల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో, జగిత్యాల జిల్లా రాయికల్‌లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. టేకులపల్లి మండలం 9వ మైల్‌ తండాలో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నునావత్ బావుసింగ్(48) ఐదు ఎకరాల చేను కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. అప్పు చేసి ఎకరానికి రూ.8000 పైగా పెట్టుబడి పెట్టాడు. అవి నకిలీ విత్తనాలు కావడంతో పూత, కాత లేదు. దీంతో అప్పు ఎలా తీర్చాలో అని మనస్తాపానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు.

అలాగే జగిత్యాల జిల్లా రాయికల్‌లో రాజారెడ్డి(70) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దోమపోటు కారణంగా రెండున్నర ఎకరాల్లో పంటకు కేవలం 7 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దీంతో కలత చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి రూ.3 లక్షల అప్పు ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top