శాసనమండలి పట్టభద్రుల స్థానానికి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల స్థానానికి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’ నియోజకవర్గ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి నల్లగొండలో, ‘మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్’ అభ్యర్థి దేవీప్రసాద్ హైదరాబాద్లో నామినేషన్ దాఖలు చేస్తారు. కాగా, ఉద్యోగ సంఘాలు దేవీప్రసాద్కు మద్దతు ప్రకటించాయి.