చిరుతదాడిలో మూడు వీధికుక్కలు గాయపడ్డాయి.
నిజామాబాద్: చిరుతదాడిలో మూడు వీధికుక్కలు గాయపడ్డాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బిక్నూరు మండలం పెద్దాయిపల్లి గ్రామంలో జరిగింది. గురువారం ర్రాతి ఈ దాడి జరిగినట్టు స్థానికులు చెప్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటినపెద్దపల్లికి చేరుకొని చిరుత పాదాల ఆనవాళ్లు సేకరించారు. ఏ సమయంలో చిరుత దాడి చేస్తుందోనని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
(బిక్నూరు)