నెట్వర్క్: అప్పుల బాధతో బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో ఏడుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలంలోని రాజంపేట గ్రామానికి చెందిన అంద్యాల లింగం (48) తనకు ఉన్న 1.36 ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈసారి వానలు సరిగ్గా కురియకపోవడంతో పంట దెబ్బతింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన లింగం బుధవారం ఉదయం విషపు గుళికలను మింగి ప్రాణాలు కోల్పోయాడు.
వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం పెగడపల్లికి చెందిన రైతు మ్యాకల తిరుపతి(28) గతేడాది పత్తి పంట వేసి తీవ్రంగా నష్టపోయూడు. ఈ ఏడాది రెండెకరాల్లో మొక్కజొన్న వేయగా, ఆశించిన దిగుబడి రాలేదు. సుమారు రూ. 2 లక్షల వరకు అప్పు కావడంతో ఎలా తీర్చాలనే మనోవేదనకు గురై పొలం వద్ద పురుగులు మందు తాగి బలవన్మరణం చెందాడు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బద్యాతండాకు చెందిన ఎన్.చందూ(35) కౌలుకు తీసుకున్న రెండున్నర ఎకరాలలో పత్తి, మిర్చి సాగుచేశాడు. వర్షాభావం కారణంగా దిగుబడి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయూడు. పంట పెట్టుబడులకు తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కానరాక తీవ్ర మనోవేదనతో అస్వస్థుడైన అతను మంగళవారం ఆస్పత్రిలో మృతిచెందాడు.
మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన మురళీధరయ్య(52) ఎకరా తరి పొలంలో వరిపంట సాగుచేశాడు. అలాగే ఈ ఏడాది కూతురు పెళ్లి కోసం రూ.లక్ష అప్పు చేశాడు. రుణదాతల నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో పొలంలోనే పురుగుమందు తాగి బలవన్మరణానికి ఒడిగట్టాడు.
ఇదే జిల్లా తెలకపల్లి మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి వెంకటయ్య(30) నాలుగెకరాల పొలంలో పత్తి పంట సాగుచేశాడు. దీనికి తోడు ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇందుకోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.3 లక్షలు అప్పుచేశాడు. ఆశించిన దిగుబడి రాకపోవడం.. అప్పులుతీర్చే మార్గం లేక తీవ్రంగా కలత చెందాడు. ఈ క్రమంలో బుధవారం పొలంలోనే చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మెదక్ జిల్లా ములుగు మండలం కొక్కొండకు చెందిన చిన్న మల్లయ్య తనకున్న ఎకరంన్నర పొలంలో వరి సాగు చేశాడు. నీరందక పంట మొత్తం ఎండిపోయింది. దీనికి తోడు ఇద్దరు కుమార్తెలు, కుమారుని పెళ్లిళ్లు చేయడంతో రూ.2లక్షల వరకు అప్పులయ్యాయి. అవి తీర్చలేని క్రమంలో మల్లయ్య మంగళవారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందాడు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎన్కేపల్లికి చెందిన కావలి కిష్టయ్య(55) ఈ ఏడాది పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేశాడు. వర్షాలు సరిగా కురవకపోవడం తో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. పెట్టుబడులు, కూతురి వివాహం కోసం కిష్టయ్య సుమారు రూ. 5 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ విషయమై ఈ నెల 9న కుటుంబీకులతో ఘర్షణ పడిన కిష్టయ్య సమీపంలోని బావిలో పడి బలవన్మరణం చెందాడు.
అప్పుల బాధతో ఏడుగురు రైతుల ఆత్మహత్య
Published Thu, Nov 20 2014 1:59 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement