సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్డౌన్ మరికొంత కాలం కొనసాగించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్ లో ‘ఆస్క్ కేటీఆర్’పేరిట నిర్వహించిన సం భాషణలో శుక్రవారం పలువురు అడిగిన ప్రశ్నలు, సందేహాలకు సమాధానం ఇచ్చారు. లాక్డౌన్ మూలంగా ప్రజల్లో స్వయం క్రమశిక్షణ ఏర్పడిందని, వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర రంగాలకు చెందిన వారిపై ప్రజ ల్లో గౌరవ భావం ఏర్పడిందన్నారు. గుర్తించిన హాట్స్పాట్లలో సామూహిక వైద్య పరీక్షలు చేయడం ద్వారా ఫలితం ఉంటుందని, వైరస్ కట్టడికి కృషి చేస్తున్న వారి బాగోగులు చూడాల్సిన అవసరం ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కరోనాకు వ్యాక్సిన్ దొరికేం త వరకు విదేశాలకు రాకపోకలపై సంపూర్ణ నిషేధం ఆచరణ సాధ్యం కాదన్నారు.
అత్యుత్తమ సదుపాయాలపై దృష్టి
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడిన తర్వాత మరింత అత్యుత్తమ వైద్య మౌలిక సదుపాయాల వైపు దృష్టి సారించాల్సి ఉంటుందని కేటీఆర్ అన్నారు. ప్రస్తుత సంక్షోభం తర్వాత ప్రభుత్వాలు తమ ప్రాధాన్యతను మార్చుకొని వైద్య రంగానికి మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వాలకి ఒక కనువిప్పు లాంటిదని, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు ఈ విషయాన్ని గుర్తించాయన్నారు. సంక్షోభ సమయంలో పరీక్షల గురించి తల్లిదండ్రులు ఓపిక పట్టాలని, పరీక్షల షెడ్యూలుకు సంబంధించి ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తుందన్నారు.
ఏడాదికి పది రోజుల లాక్డౌన్
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏటా పది రోజులు ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటిస్తే బాగుంటుందని కేటీఆర్ వ్యా ఖ్యానించారు. ప్రస్తుత తరుణంలో రాజకీయాలకు అవకాశం లేదని, అధికారం ఉన్నందువల్లే తాను ఎక్కువ మందికి సాయపడుతున్న ట్లు వెల్లడించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తో చర్చిస్తున్నామన్నారు. ప్రజలతో కనెక్ట్ అ య్యేందుకు సోషల్మీడియాలో ఎక్కువ సేపు అందుబాటులో ఉండటంతో నిద్రకు సమ యం దొరకడం లేదన్నారు. లాక్డౌన్ మొదలైన రోజు నుంచి కేటీఆర్, ఆయన కా ర్యాలయం స్పందిస్తున్న తీరును ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అభినందించారు.
లాక్డౌన్ మరికొంతకాలం పొడిగించాలి
Published Sat, Apr 11 2020 2:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement