మహబూబ్నగర్ అర్బన్: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా, రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యమని సీఎల్పీ కార్యదర్శి, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్ విమర్శించారు. సోమవారం స్థానిక డీసీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యమకాలంలో చేసిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు చేయని సీఎం రూ.6వేల కోట్ల వాటర్గ్రిడ్ పనులు తన కొడుకుకు, మరో రూ.35వేల కోట్లతో అల్లుడికి కాకతీయ మిషన్ పనులు అప్పజెప్పారని ఎద్దేవా చేశారు.
ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాల్సిన సీఎంనాలుగు రోజుల పాటు తన ఫాంహౌజ్లో ఉండి అల్లం సాగును పర్యవేక్షించడం బాధ్యతల నుంచి తప్పుకోవడమేన ని విమర్శించారు. జిల్లా మంత్రులు ఎక్కడ డబ్బులు దొరుకుతాయో, తమ అనుచరులకు పనులెట్లా ఇప్పించుకోవాలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. చంద్రబాబు జిల్లాను దత్తత తీసుకుని పట్టించుకోలేదని, తాను ప్రత్యేక శ్ర ద్ధ తీసుకొని అభివృద్ధి చేస్తానన్న ముఖ్యమంత్రి కనీసం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కూడా యత్నించడం లేదనన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కేసీఆర్ మానసపుత్రిక అని చెప్పుకోవడం సిగ్గుచేటని, ఆ పథకానికి నాంది పలికి నిధులు, డీపీఆర్ విడుదల చేసిన ఘనత కాంగ్రెస్దేనని పేర్కొన్నారు. తన మాట వినని మీడియా గొంతును నొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిన చర్యలు టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లిందనన్నారు.
సీఎం, జిల్లా మంత్రులు పర్యటనలకు వచ్చినప్పుడు అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చి వారి భాగస్వామ్యంతో అభివృద్ధికి పాటుపడే ఆనవాయితీని ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాలో సాగు0నీటి సౌకర్యం కల్పించడానికి ఎమ్మెల్యేలు, మంత్రులు పనిచేయాలని లేకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్, ఉపాధ్యక్షులు రంగారావు, మీడియాసెల్ కన్వీనర్ పటేల్ వెంకటేశ్, నేతలు అంజయ్య, గోపాల్రెడ్డి, అమరేందర్రాజు పాల్గొన్నారు.
‘ఏడాదిలో కేసీఆర్ చేసింది శూన్యం’
Published Tue, Jun 30 2015 10:46 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రోడ్డుపై పడుకున్న వారిపై యాసిడ్ దాడి
కాలిపోయిన స్థితిలో శవం లభ్యం
వేడుకగా అగ్నిగుండ మహోత్సవం
నకిలీ పత్రాల సృష్టి కేసులో యువకుడి అరెస్టు
విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు ఒప్పందాలు
రైలులో నుంచి పడి ప్రయాణికుడు..
ఇద్దరు పోలీసుల సస్పెన్షన్
సామాజిక సేవే లక్ష్యం
రాయితీ విత్తనాలు రెడీ
అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు
తప్పక చదవండి
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement