హెరిటేజ్ పాలల్లో పురుగులు

హెరిటేజ్ పాలల్లో పురుగులు - Sakshi


హైదరాబాద్: నాణ్యతకు మారుపేరుగా సొంత డబ్బా కొట్టుకునే హెరిటేజ్ సంస్థకు చెందిన పాలల్లో పురుగులు వస్తున్నాయి. ఈ సంఘటన హైదరాబాద్ లోని మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.


 


సలీంనగర్ డివిజన్‌లో రఘు అనే యువకుడు పాలప్యాకెట్లను విక్రయిస్తుంటాడు. స్థానిక తార టవర్స్‌లోని ఓ గృహిణి మంగళవారం ఉదయం పాల ప్యాకెట్లు కొనగా అందులో పురుగులు వచ్చాయి. దీంతో సదరు మహిళ ఈ విషయాన్ని పాల ప్యాకెట్ల డిస్ట్రిబ్యూటర్‌కు తెలిపింది. ఈ నేపథ్యంలో హెరిటేజ్ పాల ప్యాకెట్‌లను కొనాలంటేనే భయంగా ఉందని స్థానికలు వాపోయారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top