అన్నం పెట్టలేదని అంతం చేశాడు | Husband brutally murders Wife | Sakshi
Sakshi News home page

అన్నం పెట్టలేదని అంతం చేశాడు

May 20 2015 5:35 PM | Updated on Jul 27 2018 2:18 PM

అర్ధరాత్రి వేళ తూలుతూ వచ్చాడు. అన్నం పెట్టమని భార్యను ఆదేశించాడు.

గట్టు :  అర్ధరాత్రి వేళ తూలుతూ వచ్చాడు. అన్నం పెట్టమని భార్యను ఆదేశించాడు. పెట్టుకుని తినమనడంతో కత్తి పట్టుకుని ఇల్లాలిని పొడిచేశాడు. తీవ్ర గాయాలతో ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం నందిన్నె గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం... ఆత్మకూరుకు చెందిన నరేష్, పద్మ(30) దంపతులు బొంతలు కుట్టుకుంటూ స్థానికంగా నివాసం ఉంటున్నారు. కాగా నరేష్ పూటుగా మద్యం సేవించి మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఇంటికి చేరాడు. ఆ సమయంలో పద్మ నిద్రపోతోంది. అన్నం పెట్టమని నరేష్ అడగ్గా... అక్కడే ఉంది కదా, పెట్టుకుని తినమని పద్మ బదులిచ్చింది. మద్యం మత్తులో ఆవేశానికి లోనైన నరేష్ కత్తి తీసుకుని పద్మను పొడిచేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను బుధవారం ఉదయం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement