అందరూ ఉన్నా అనాథే.. | Everyone, no matter orphans .. | Sakshi
Sakshi News home page

అందరూ ఉన్నా అనాథే..

Feb 22 2015 4:25 AM | Updated on Aug 16 2018 4:30 PM

ఈ చిన్నారి ఎవరో ఎట్టకేలకు తెలిసింది. తీవ్రంగా గాయపడిన స్థితిలో మూడు రోజుల క్రితం సంగారెడ్డి బస్టాండ్‌లో...

- చిన్నారి పేరు శిరీష
- తండ్రి రిమాండ్ ఖైదీ
- జాడలేని తల్లి ఆచూకీ

సంగారెడ్డి క్రైం: ఈ చిన్నారి ఎవరో ఎట్టకేలకు తెలిసింది. తీవ్రంగా గాయపడిన స్థితిలో మూడు రోజుల క్రితం సంగారెడ్డి బస్టాండ్‌లో లభ్యమైన పసిపాప పేరు శిరీష. తల్లిదండ్రులున్నా అనాథగానే మిగిలింది. తండ్రి జైలులో ఉండగా తల్లి జాడ తెలియరాలేదు. వివరాల్లోకి వెళ్తే...

కాలిన గాయాలతో లభ్యమైన శిరీష ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటుంది. సంగారెడ్డి శిశు గృహ ఇన్‌చార్జి రాంరెడ్డి సంరక్షణలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పాపకు డాక్టర్లు వై ద్యం అందిస్తున్నారు. చిన్నారి లభిం చిన ఫొటోలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. సంగారెడ్డి మండలం కంది లోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సలావొద్దీన్ పేపర్‌లో వచ్చిన కథనం చూసి తన పాపను గుర్తిం చాడు. ఇదే విషయాన్ని జైలు సూపరింటెండెంట్ నాగేశ్వర్‌రెడ్డికి తెలుపగా ఆయన పట్టణ పోలీసులకు సమాచారమందించారు.

చిన్నారి పూర్తిగా కోలుకున్న తరువాత జైలుకు తీసుకెళ్లి తండ్రికి చూపిస్తామని పోలీ సులు తెలిపారు. సలావొద్దీన్ విద్యు త్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఆయిల్ దొంగతనాల కేసులో నిందితుడిగా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. పుల్కల్‌కు చెందిన లక్ష్మి అనే మహిళ తో సలావొద్దీన్‌కు వివాహం కాగా వారిద్దరికీ పుట్టిన బిడ్డే శిరీషగా సలావొద్దీన్ చెబుతున్నాడు. లక్ష్మికి ఇదివరకే పెళ్లి కాగా, సలావొద్దీన్‌కు కూడా గతంలో పెళ్లి జరిగింది. సలావొద్దీన్ జైలుకు వెళ్లిన క్రమంలో లక్ష్మి తన వద్ద లేకపోవడంతో శిరీషను సదాశివపేటలోని తన మొదటి భార్య తల్లి (అత్త) వద్ద వదిలి వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. సలావొద్దీన్ సంబంధీకులను పట్టుకునేందుకు యత్నిస్తున్నట్టు పట్టణ సీఐ ఆంజనేయులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement