పునాదులు వేసింది మేమే: డీకే అరుణ | dk aruna demand for gadwal district | Sakshi
Sakshi News home page

పునాదులు వేసింది మేమే: డీకే అరుణ

Sep 19 2014 5:31 PM | Updated on Oct 8 2018 5:04 PM

పునాదులు వేసింది మేమే: డీకే అరుణ - Sakshi

పునాదులు వేసింది మేమే: డీకే అరుణ

మహబూబ్‌నగర్ జిల్లాలో రెండో జిల్లాను గద్వాల్‌లో మాత్రమే ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ డిమాండ్ చేశారు.

హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో రెండో జిల్లాను గద్వాల్‌లో మాత్రమే ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ డిమాండ్ చేశారు. అందుకు గద్వాల్‌కు అన్ని అర్హతలు ఉన్నాయన్నారామె. మహబూబ్‌నగర్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులకు పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఆమె గుర్తు చేశారు.

విద్యుత్ కొరత కారణంగా పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అరుణ అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉందని చెప్పారు. కేసీఆర్ ఒక్కరి వల్లే తెలంగాణ రాలేదని గుర్తు చేశారు. తెలంగాణను అభివృద్ధి చేసేందుకు అందరినీ కలుపుపోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement