
జీఎస్టీతో తెలంగాణకు భారం: ఉత్తమ్
జీఎస్టీతో తెలంగాణ ప్రజలపై పన్నుల భారం అధికమవుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు.
ప్రజావాణిని కేంద్రానికి వినిపించడంలో రాష్ట్ర సర్కారు విఫలమైందన్నారు. జీఎస్టీ అమలుతో వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చొరవచూపిన లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్కు టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు.