జీఎస్టీతో తెలంగాణకు భారం: ఉత్తమ్‌ | Burden to Telangana with GST: UTTAM | Sakshi
Sakshi News home page

జీఎస్టీతో తెలంగాణకు భారం: ఉత్తమ్‌

Jul 3 2017 2:19 AM | Updated on Sep 19 2019 8:44 PM

జీఎస్టీతో తెలంగాణకు భారం: ఉత్తమ్‌ - Sakshi

జీఎస్టీతో తెలంగాణకు భారం: ఉత్తమ్‌

జీఎస్టీతో తెలంగాణ ప్రజలపై పన్నుల భారం అధికమవుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

నేరేడుచర్ల (హుజూర్‌నగర్‌): జీఎస్టీతో తెలంగాణ ప్రజలపై పన్నుల భారం అధికమవుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో విలేకరుల సమావేశంలో, పాలకీడులో   ప్రజాగర్జన సభలో ఆయన మాట్లాడారు. జీఎస్టీ అమలుతో తెలంగాణకు వేల కోట్ల భారం అవుతోందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ సూచించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.

ప్రజావాణిని కేంద్రానికి వినిపించడంలో రాష్ట్ర సర్కారు విఫలమైందన్నారు. జీఎస్టీ అమలుతో వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చొరవచూపిన లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌కు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మద్దతు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement