పార్టీ విస్తరణపై బీజేపీ నేతల దృష్టి | bjp eye on expansion in telangana | Sakshi
Sakshi News home page

పార్టీ విస్తరణపై బీజేపీ నేతల దృష్టి

Dec 9 2014 2:04 AM | Updated on Mar 29 2019 9:24 PM

‘బీజేపీ బలోపేతం ద్వారానే దేశాన్ని బలోపేతం చేయగలం’ అనే నినాదంతో వివిధ వర్గాల్లోకి వెళ్లి పార్టీని పటిష్టం చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.

సాక్షి, హైదరాబాద్: ‘బీజేపీ బలోపేతం ద్వారానే దేశాన్ని బలోపేతం చేయగలం’ అనే నినాదంతో వివిధ వర్గాల్లోకి వెళ్లి పార్టీని పటిష్టం చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. సోమవారం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులు, వివిధ విభాగాల రాష్ట్ర స్థాయి కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్ల సమావేశం జరిగింది.

సభ్యత్వ కార్యక్రమాన్ని ఉధృతంగా చేపట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, నేతలు చింతాసాంబమూర్తి, జి.ప్రేమేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా హోంగార్డుల జీతాలను రూ.12 వేలకు పెంచిన సందర్భంగా రాష్ట్ర హోంగార్డుల సంక్షేమ సంఘం చైర్మన్‌గా ఉన్న కిషన్‌రెడ్డిని ఆ సంఘం ప్రతినిధులు సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement