యాంకర్‌ అనసూయకు వేధింపులు | Anchor anasuya Complaint To Police Against Abusive Comments On Social Media | Sakshi
Sakshi News home page

యాంకర్‌ అనసూయకు వేధింపులు

Feb 10 2020 1:53 PM | Updated on Feb 10 2020 2:26 PM

Anchor anasuya Complaint To Police Against Abusive Comments On Social Media - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌కు సోషల్‌ మీడియా వేదికగా వేధింపులు ఎక్కువైపోయాయి. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.  అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ట్విటర్‌ వేదికగా ఫిర్యాదు చేశారు. అనసూయ ఫిర్యాదుపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు స్పందించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొందరు వ్యక్తులు శృతిమించుతూ చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలకు స్పందించపోతే సహనానికి అర్థం ఉండదని అనసూయ ట్వీట్‌ చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలకు తాను సిగ్గు పడడం లేదని సరైన వ్యవస్థలు చర్యలు తీసుకోవాలని ట్వీటర్‌లో పేర్కొన్నారు. తన ఫిర్యాదు స్పందించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అనసూయ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement