పేదలకు పంపిణి చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా నల్లబజారుకు తరలిస్తున్నారని గుర్తించిన గ్రామస్థులు 40 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
Mar 5 2016 12:23 PM | Updated on Aug 29 2018 4:18 PM
గుండాల: పేదలకు పంపిణి చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా నల్లబజారుకు తరలిస్తున్నారని గుర్తించిన గ్రామస్థులు 40 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించారు. నల్లగొండ జిల్లా గుండాల మండలం వెలమజల గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఆటోలో తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించిన స్థానికులు వాహనాన్ని అదుపులోకి తీసుకొని అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు 2 దుకాణాలను సీజ్చేశారు.
Advertisement
Advertisement