breaking news
-
నేను బీఆర్ఎస్ చైర్మన్ను కాదు: గుత్తా సుఖేందర్రెడ్డి
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం(అక్టోబర్9) శాసన మండలిలో చీఫ్విప్గా పట్నం మహేందర్రెడ్డి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా సుఖేందర్రెడ్డి మీడియాతో మాట్లాడారు.మహేందర్రెడ్డిని బీఆర్ఎస్ విప్గా చూడాలా? కాంగ్రెస్ విప్గా చూడాలా అని మీడియా అడగ్గా మహేందర్ రెడ్డిని అఫిషియల్ విప్గా చూడాలని సుఖేందర్ రెడ్డి సమాధానమిచ్చారు. తాను బీఆర్ఎస్ మండలి చైర్మన్ కాదని, మండలి చైర్మన్ పదవి తీసుకున్నాక తనకు ఏ పార్టీతో సంబంధం ఉండదని స్పష్టం చేశారు.బీఆర్ఎస్పై గుత్తా ఫైర్..ఉద్యోగ నియామకాల మీద బీఆర్ఎస్ మాట్లాడుతోంది..ఆనాడు మీరేం చేశారుఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో గుర్తు చేసుకుంటే మంచిదిమూసీపై డీపీఆర్ కాకముందే ఆరోపణలు చేయడం సరికాదు.ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై మాట్లాడే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలిఆర్థిక వనరులు ఉన్నాలేకపోయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తోంది.ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ మాట ప్రకారం పూర్తి చేస్తున్నారు.నాయకులు వాడుతున్న భాషా సరిగా లేదు.బీఆర్ఎస్ సోషల్ మీడియా వాడుకున్నా ఇంకేమైనా వాడుకున్నా పద్దతిగా ఉండాలిఒక పని ప్రభుత్వం చేస్తుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ కౌంట్ చేయవద్దుమూసీ ప్రక్షాళన కూడా అంతే.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంహైడ్రా వల్లే రిజిస్ట్రేషన్ లు పడిపోయాయి..ఆదాయం తగ్గిందనడం కరెక్ట్ కాదు.ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఉంది.అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల ఖర్చు పెంచారు.. దీనికి అందరూ భాధ్యులే.. ఇదీ చదవండి: ఇంకా మీపై చర్చ ఎందుకు: కేటీఆర్కు పొన్నం కౌంటర్ -
మీపై ఇంకా చర్చ ఎందుకు: కేటీఆర్కు పొన్నం కౌంటర్
సాక్షి,హైదరాబాద్:రాహుల్ గాంధీపై సెటైర్స్ వేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.పదేండ్లలో కేసీఆర్ సర్కార్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం(అక్టోబర్9) ఆయన మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు.‘మేం చిత్తశుద్ధితో ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం.విద్యార్థులు, నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారు.విదేశీ విద్యానిధి గత ప్రభుత్వంలో 150 మందికి ఇచ్చారు.మేం 500 మందికి ఇవ్వబోతున్నాం.అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కర్రుకాల్చి వాత పెట్టినా బుద్ధి రావడం లేదు.ప్రజలు ఓడించాక ఇంకా పదేళ్ల పాలన పై చర్చ ఎందుకు’అని పొన్నం అన్నారు. కాగా, యువతకు 2 లక్షల ఉద్యోగాలిచ్చిన రాహుల్గాంధీకి హైదరాబాద్ అశోక్నగర్కు స్వాగతమని ఎక్స్లో కేటీఆర్ చేసిన పోస్టుకు పొన్నం కౌంటర్ ఇచ్చారు. ఇదీ చదవండి: రాజకీయ లబ్ధి కోసం మా పరువు తీశారు -
తెలంగాణలో వైఫల్యంతోనే హరియాణాలో కాంగ్రెస్ ఓటమి
సాక్షి, హైదరాబాద్: ‘‘కర్ణాటకలో ఐదు గ్యారంటీలు, తెలంగాణలో ఆరు గ్యారంటీల పేరిట డొల్ల హామీలతో ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్.. హరియాణాలోనూ ఏడు గ్యారంటీల పేరిట మభ్యపెట్టాలని చూసింది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ప్రదేశ్లలో గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు. దీనికి హరియాణాలో ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించడమే నిదర్శనం..’’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సందర్భంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా గ్యారంటీలు ప్రకటిస్తూ వచ్చిన కాంగ్రెస్.. చివరికి బొక్క బోర్లా పడిందని విమర్శించారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు చిత్తు కాగితంలా మారాయని, అలవి కాని హామీలతో గద్దెనెక్కాలని భావించిన కాంగ్రె స్కు జనం కర్రు కాల్చి వాత పెట్టారని పేర్కొ న్నారు.తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రజల కు కాంగ్రెస్ గ్యారంటీల డొల్లతనం పూర్తిగా అర్థమైందని.. రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలన వైఫల్యాలే హరియాణాలో ఓటమికి దారితీశాయని విమ ర్శించారు. సోషల్ మీడియా విస్తృతి పెరుగు తున్న ప్రస్తుత సమయంలో ప్రజల నుంచి వాస్తవాలు దాచడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. బీజేపీని ఢీకొట్టే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉంది కాంగ్రెస్తో ముఖాముఖి పోరు ఉన్న రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తోందని.. రాహుల్ బలహీన నాయక త్వం కూడా కాంగ్రెస్ ఓటమికి కారణ మని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీని ఢీకొని నిలువరించే శక్తి కేవలం ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉందన్నారు. ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి 2029లో కేంద్రంలో జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్కు మెజారిటీ సాధ్యం కాదని.. బలమైన ప్రాంతీయ పార్టీలే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. దేశంలో సమాఖ్య స్ఫూర్తిని, సమగ్రతను, సెక్యులరిజాన్ని కాపాడాలని కోరుకునే మేధావులు, ప్రజలంతా ప్రాంతీయ పార్టీలకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్రాజ్, పార్టీ ఫిరాయింపులు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే వ్యవహారాలు నడుస్తున్నా రాహుల్ గాంధీ చూసీ చూడనట్టు వ్యవహరించిన తీరును దేశం మొత్తం గమనిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డులకు ప్రజాక్షేత్రంలో కాలం చెల్లిందనే విషయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. పండుగ పూట పస్తులు రాష్ట్రంలో కాంగ్రెస్ దండగగా మారి పాలనలో పండుగ పూట కూడా పస్తులు తప్పడం లేదని.. ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఐదారు నెలలుగా వేతనాలు లేవని కేటీఆర్ ఆరోపించారు. పంచాయతీ, మున్సిపల్ కారి్మకులు, ఆస్పత్రుల సిబ్బంది, హాస్టల్ వర్కర్స్, గెస్ట్ లెక్చరర్స్ మొదలుకుని ప్రతీ ప్రభుత్వ శాఖలో వేతనాల్లేక చిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఒకటో తారీఖునే జీతాలు ఇస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని.. దసరా పండుగ వచి్చనా చిరుద్యోగుల చేతిలో చిల్లిగవ్వ లేదని విమర్శించారు. నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోతే.. చిరుద్యోగుల బతుకు బండి ఎలా సాగుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. -
హర్యానా, కశ్మీర్ ఫలితాలపై హరీష్ ఆసక్తికర కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గారడీలను హర్యానా ప్రజలు నమ్మలేదని.. అందుకే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని సెటైర్లు వేశారు. అటు కశ్మీర్లో బీజేపీని విశ్వసించలేదని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ గ్యారెంటీల గారడీని హర్యానా ప్రజలు విశ్వసించలేదని ఫలితాలు తేల్చి చెబుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హర్యానా ప్రజలు నిశితంగా గమనించారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడింది.ఈ ఫలితాలు చూసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రతీకార రాజకీయాలు, దృష్టి మళ్లింపు రాజకీయాలు మానుకొని, ఆరు గ్యారెంటీలను, 420 హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలి. అటు కశ్మీర్లో బీజేపీని విశ్వసించలేదు, హర్యానాలో కాంగ్రెస్ను విశ్వసించలేదు. రెండు జాతీయ పార్టీల పట్ల ప్రజల్లో విముఖత ఉన్నదనేది సుస్పష్టం అంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ గ్యారెంటీల గారడీని హర్యానా ప్రజలు విశ్వసించలేదని ఫలితాలు తేల్చి చెబుతున్నాయి.తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హర్యానా ప్రజలు నిశితంగా గమనించారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడింది. ఈ ఫలితాలు చూసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి…— Harish Rao Thanneeru (@BRSHarish) October 8, 2024 -
మూసీ లెక్కలు చెప్పేందుకే ఢిల్లీకి రేవంత్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రాజెక్టు మూ టల లెక్కలు చెప్పేందుకే సీఎం రేవంత్రెడ్డి హస్తిన పర్యటనలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పేదల గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలో తన బాస్లతో మంతనాలు చేస్తున్నారని మండిపడ్డారు. పదినెలల పాలనలో 23మార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రాష్ట్రానికి తెచి్చన నిధులు, చేసిన మేలు ఏమిటో చెప్పాలన్నారు. ఈ మేరకు సోమవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యధిక పర్యాయాలు ఢిల్లీకి వెళ్లిన సీఎంగా రేవంత్ రికార్డు సృష్టిస్తున్నారని అన్నారు.సీటు కాపాడుకునేందుకే: అధిష్టానం మెప్పు కోసం తరచూ ఢిల్లీకి వెళుతున్న సీఎం రేవంత్ తన బాస్ లకు జై కొట్టి సీటును కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నాడని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ పాలనపై కాంగ్రెస్ అధిష్టానం సంతృప్తిగా లేనందునే పదేపదే ఢిల్లీకి పిలిచి ఆయనకు చివాట్లు పెడుతోందన్నారు. సీఎం ఢిల్లీ పర్యటన తీరు చూస్తే ఐదేళ్లలో ఆయన 125 మార్లు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే ఢిల్లీకి గులాంగిరీ తప్పదని గతంలో తాము చెప్పిందే వాస్తవమవుతోందన్నారు. నిధులు తెస్తానంటూ మోసగిస్తున్నాడు: కేంద్రంలోని పెద్దలను ఒప్పించి రాష్ట్రానికి నిధులు తెస్తానంటూ నమ్మబలుకుతున్న రేవంత్ ఇప్పటి వరకు రాష్ట్రానికి తెచ్చిన నిధుల లెక్క తేల్చాలన్నారు. కేంద్ర బడ్జెట్తోపాటు ఇటీవల వరద సాయంలో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని చెప్పారు. -
తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటున్నవ్ స్వామి?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ను కాపాడుకోవటం చేతకాక, సామాన్యులపైకి బుల్డోజర్స్ పంపి.. భయాన్ని సృష్టింస్తున్నారని మండిపడ్డారు. తీరా చూస్తే హైడ్రా హడావిడీతో రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయిందన్నారు. హైడ్రా కారణంగా రెండు నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని తెలిపారు.రిజిస్ట్రేషన్లు పడిపోయాయని, ఆదాయం తగ్గిపోయిందని కేటీఆర్ విమర్శించారు. కొత్తగా ఆదాయం సృష్టించకపోయినా ఫర్వాలేదుగానీ, ఉన్నది ఊడగొడుతున్నారని దుయ్యబట్టారు. సామాన్యులు కొనుగోలు, అమ్మకం లేనిది బూమ్ ఎట్లా వస్తది? ఆదాయం ఎట్లా పెరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అసలేం చేద్దామనుకుంటున్నారంటూ ప్రశ్నించారు.పనిమంతుడని పందిరేపిస్తే... పిల్లి తోక తగిలి కూలిందట. గట్లనే ఉంది చీప్ మినిస్టర్ రేవంత్ రెడ్డి తీరు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ ను కాపాడుకోవటం చేతకాక, సామాన్యులపైకి బుల్డోజర్స్ పంపి... భయాన్ని సృష్టించాడు. తీరా చూస్తే, రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయింది.… pic.twitter.com/EwPkTPBOP1— KTR (@KTRBRS) October 7, 2024 -
బిడ్డలకు మూసీ పేరు పెట్టుకునేలా చేస్తాం!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఎవరు అడ్డొచ్చినా మూసీ రివర్ ఫ్రంట్ పథకం ఆగదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రకటించారు. మూసీ పరీవాహకం పరిధిలో ఉన్న పది వేల కుటుంబాలకు మురికి జీవితం కాకుండా మంచి జీవితం అందించటం కూడా ఈ ప్రాజెక్టులో భాగమని పేర్కొన్నారు. ‘‘మన ఇళ్లలో ఆడబిడ్డలకు గోదావరి, సరస్వతి, నర్మద, కృష్ణా.. ఇలా నదుల పేర్లు పెట్టుకుంటాం. మరి మూసీ కూడా నది పేరే కదా. ఆ పేరు ఎందుకు పెట్టుకోవటం లేదు. మూసీ అనగానే మురికి కూపమన్న భావన రావడమే దీనికి కారణం. అందుకే ఆ మురికిని ప్రక్షాళన చేసి.. నదిని అద్భుతంగా మార్చుతాం. పిల్లలకు మూసీ అన్న పేరు పెట్టుకునేలా చేస్తాం’’ అని రేవంత్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో గతంలోనే నోటిఫికేషన్లు జారీ అయిన ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన 1,635 మందికి ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘గతంలో ఎన్నో ప్రాజెక్టులకు భూసేకరణ జరిపినప్పుడు లేని ఇబ్బంది మూసీ విషయంలో ఎందుకు? ఆ కుటుంబాలు జీవితాంతం మురికిలోనే ఉండాలా? వారిని బాగు చేసే బాధ్యత ప్రభుత్వంతీసుకుంటుంది. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించటంతోపాటు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మూసీ పరిధిలో 10వేల కుటుంబాలు ఉన్నాయని 33 బృందాలు ఆరునెలల పాటు సర్వే చేసి తేల్చాయి. బఫర్ జోన్లో ఉన్న వారిని ఎలా ఆదుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రాజెక్టును అడ్డుకోవడం కాదు.. కావాలంటే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి. కాళేశ్వరం కోసం లక్ష కోట్లు తగలబెట్టిన వారికి ఇది తెలియదా? ఇటీవల బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా బీఆర్ఎస్ నేతల తరహాలోనే మూసీ ప్రాజెక్టుపై మాట్లాడుతున్నారు. ఆయన అంగీ మార్చినా బీఆర్ఎస్ వాసనను వదిలించుకున్నట్టు లేదు. సబర్మతి తరహాలో మూసీని అభివృద్ధి చేద్దాం. కేంద్రం నుంచి ఓ 20 వేల కోట్లు వచ్చేలా బీజేపీ ఎంపీలు చేయలేరా? పరామర్శల పేరుతో మూసీ పరీవాహక ప్రాంతాలకు వచ్చే కేటీఆర్, హరీశ్రావు, ఈటల రాజేందర్లను ఓ వారంపాటు అక్కడే ఉంచితే ఆ ప్రాంత జనం కష్టాలేమిటో తెలిసి వస్తాయి. గతంలో నోటిఫికేషన్లు ఇచ్చి చేతులెత్తేశారు.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన నాటి ప్రభుత్వ పెద్దలు.. నియామకాలను పట్టించుకోలేదు. వీటికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులను పరిష్కరించటం తమ బాధ్యతగా భావించకపోవటం వల్ల ఏళ్ల తరబడి నియామకాలు పెండింగ్లో ఉండిపోయాయి. యువతకు ఉద్యోగాలు రావాలంటే నాటి సీఎం, మంత్రుల కుర్చీల్లో కూర్చున్న వారి ఉద్యోగాలు ఊడాలని విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమంలో చెప్పాను. దాన్ని మీరు చేసి చూపించారు. మా కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందం చూస్తూ.. మేం సీఎంగా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశాం. ప్రభుత్వం ఏర్పడ్డ 90 రోజుల్లోనే 31వేల ఉద్యోగాలు కల్పిస్తూ.. నిరుద్యోగ యువత తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూసేలా నియామక పత్రాలను అందించాం. ఇప్పుడు దసరా ముందు 1,635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించటం ద్వారా వారి కుటుంబాలు మరింత ఆనందంగా పండుగ నిర్వహించుకునేలా చేశాం. మరో 11,063 మందికి ఈ నెల 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఉపాధ్యాయ నియామక పత్రాలను అందించబోతున్నాం. ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు? భాక్రానంగల్ డ్యామ్ నుంచి నాగార్జునసాగర్, శ్రీశైలం వరకు దశాబ్దాలుగా నిలబడి ఉండేలా కట్టిన నాటి ఇంజినీర్లను, హైదరాబాద్ వెలుపల జంట జలాశయాలకు ప్లాన్ చేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యలను ఆదర్శంగా తీసుకుంటారా? లేక కట్టిన కొన్నేళ్లకే కూలిపోయిన కాళేశ్వరాన్ని నిర్మించిన వారిని ఆదర్శంగా తీసుకుంటారో ఉద్యోగులు, ఇంజనీర్లు నిర్ణయించుకోవాలి. కొత్తగా విధుల్లోకి చేరుతున్న ఇంజనీర్ల చేతుల మీదుగా రీజనల్ రింగురోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, ఫార్మాసిటీ, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతున్నాయి. చెక్డ్యామ్లు మొదలు కాళేశ్వరం వరకు గత పదేళ్లలో అప్పటి ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాల నాణ్యత డొల్లతనాన్ని చూపిస్తాం రండి.. నాటి మంత్రులకు ఇదే నా సవాల్. దసరా ముందు సంతోషం నింపాం: మంత్రి కోమటిరెడ్డి మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి మహనీయ ఇంజనీర్లు పనిచేసిన ఈ నేలమీద ఇప్పుడు కొందరు ఇంజనీర్లు విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి రావటం బాధగా ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ‘‘అధికారులు అందించిన ప్లాన్లను పక్కనపెట్టి తానే పెద్ద ఇంజనీర్ అన్నట్టుగా నాటి సీఎం కేసీఆర్ కట్టిన మూడేళ్లకే కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతినేలా చేశారు. ఏళ్ల క్రితం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదు. అలా పెండింగు పెట్టిన వాటిని తమ ప్రభుత్వం పరిష్కరించి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వటం ద్వారా దసరా ముందు వారి ఇళ్లలో సంతోషాన్ని నింపుతోంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్నవారు బాధ్యతగా పనిచేయాలి. నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలి. దశాబ్దాలుగా అద్భుత సేవలందిస్తున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టును కొత్త ఇంజినీర్లు ఆదర్శంగా తీసుకోవాలి. కట్టిన మూడేళ్లకే కుంగిన కాళేశ్వరం ప్రాజెక్టును కాదు’’ అని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కె.కేశవరావు, నేతలు కోదండరెడ్డి, పట్నం మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాల్స్ కట్టి పెద్దలకు ధారాదత్తం చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: బ్యూ టిఫికేషన్ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తారా అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నిలదీశారు. ఈ మేరకు ఆయన ఆదివారం సీఎంకు బహిరంగ లేఖ రాశారు.మూసీ ప్రక్షాళనకి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? డీపీఆర్ ఉందా? ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి? రూ. కోట్ల విలువ చేసే ఇల్లు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఎలా? సబర్మతి నది ప్రక్షాళనకి రూ. 2 వేల కోట్లు, నమోగంగ ప్రాజెక్ట్కి 12 ఏళ్లలో రూ. 22 వేల కోట్లు ఖర్చు పెడితే మూసీ ప్రక్షాళనకు రూ. లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి? ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలని ఈటల సీఎంను డిమాండ్ చేశారు.స్టేజీల మీద ప్రకటనలు చేయడం కాకుండా ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం పెడితే తాము ఎక్కడికైనా రావడానికి సిద్ధమన్నారు. ఈ విషయాలపై స్పష్టత వచ్చే వరకు తన ప్రతిఘటన ఉంటుందని తెలిపారు. -
27 రోజుల్లో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతాంగానికి రూ. 2లక్షల రుణమాఫీ ప్రక్రియను మాట ఇచ్చిన ప్రకారం పూర్తి చేశామంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖ లో ఆ వివరాలను ప్రస్తావించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు మాఫీ చేయలేదని, ఇలాంటి మోసపూరిత వాగ్దానాలను నమ్మొద్దంటూ వ్యా ఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ లేఖను ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.కాంగ్రెస్ హామీ అంటే బంగారు హామీ అని తెలంగాణ రైతులు నమ్మారని, అలాంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రుణమాఫీ చేసి దేశానికి కొత్త పంథా చూపెట్టామని ఎక్స్లో పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ అభివృద్ధికి భవిష్యత్లో కేంద్రం నుంచి తగిన సహకారం అందించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ కోరారు. లేఖలో ఏం రాశారంటే...!ప్రధాని మోదీకి రాసిన లేఖలో మూడు దఫాలు గా రైతు రుణమాఫీని తెలంగాణలో అమలు పరిచిన తీరును సీఎం రేవంత్ వివరించారు. ఈ ఏడాది జూలై 18న రూ.లక్ష లోపు రుణమాఫీకి సంబంధించి 11,34,412 రైతు ఖాతాల్లో రూ. 6,034.97 కోట్లు జమ చేశామని, జూలై 30న రూ.1.50 లక్షలలోపు మాఫీ కోసం 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6,190.01 కోట్లు జమ చేశామని, ఆగస్టు 15వ తేదీన రూ.2లక్షల వరకు మాఫీ కోసం 4,46,832 మంది ఖాతాల్లో రూ. 5,644.24 కోట్లు జమ చేశామని వెల్లడించారు.మొత్తం కేవలం 27 రోజుల వ్యవధిలో రూ.17,869.22 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులు ఆ ఎక్కువ ఉన్న రుణాన్ని బ్యాంకుల్లో కడితే రూ. 2 లక్షలు ప్రభుత్వం చెల్లించేందుకు సిద్ధంగా ఉందని, ఈ ప్రక్రియను కూడా నిర్ణీత గడువులో పూ ర్తి చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్లో పారదర్శకత కోసం అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని, అప్పు ల ఊబి నుంచి రైతులను విముక్తి చేయడమే లక్ష్యంగా ఈ ప్రక్రియ పూర్తి చేశామని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని వెల్లడించారు. -
గ్యారెంటీలపై నిలదీయండి: యువతకు హరీశ్రావు పిలుపు
సాక్షి,హైదరాబాద్:గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి కాంగ్రెస్కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలని మాజీ మంత్రి హరీశ్రావు కోరారు. ఈ మేరకు ఆదివారం(అక్టోబర్6) ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు.‘గ్యారెంటీలు అమలు చేయలేకపోగా,మీ ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు,రైతు బంధును నిలిపివేశారు,రైతు భరోసా దిక్కులేకుండా పోయింది,బోనస్ను బోగస్ చేశారు.ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నరు,పది నెలలు గడిచాయి వాటికి అతీ గతి లేదు.నాలుగు వేల నిరుద్యోగ భృతికి నీళ్లు వదిలారు.ఈ దసరాకు మీ ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు,స్నేహితులతో అలయ్-బలయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించండి.మీ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలతో పాటు,రైతు డిక్లరేషన్,యూత్ డిక్లరేషన్,ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్,మైనారిటీ డిక్లరేషన్,బీసీ డిక్లరేషన్లపై ఎక్కడిక్కడ నిలదీయండి’అని హరీశ్రావు యువతకు పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూఠిఫికేషన్: కేటీఆర్ -
మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతులకు రుణమాఫీ చేసేందుకు పైసల్లేవుగానీ.. రూ.1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తారా అని సీఎం రేవంత్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తే కమీషన్లు రావని.. అదే మూసీ ప్రాజెక్టు అయితే రూ.30 వేల కోట్లు దోచుకోవచ్చని ప్లాన్ వేశారని ఆరోపించారు. ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదని, పెద్ద లూటిఫికేషన్ అని విమర్శించారు. పార్టీ పెద్దలకు కమీషన్లు పంపి కుర్చీని కాపాడుకోవటం కోసమే మూసీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ‘‘పైసలు కావాలంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు చందాలు వేసుకుని ఇస్తాం. రాహుల్గాంధీకి పంపి కుర్చీని కాపాడుకో.. అంతేకానీ పేదల జోలికి రావొద్దు. నీ కళ్లు చల్లబడతాయంటే మా ఇళ్లు కూల్చు.కానీ పేదల ఇళ్లను కూలగొట్టవద్దు. ముందు రెడ్డికుంటలోని మీ ఇంటిని, దుర్గంచెరువులోని మీ అన్న ఇంటిని కూల్చు’’ అని రేవంత్కు సవాల్ చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..‘‘సిగ్గు, శరం ఉన్నవాళ్లకు మనం మర్యాద ఇవ్వాలి. ఈ సీఎంకు అలాంటివి ఏమీ లేవు. కేసీఆర్ రుణమాఫీ చేసిన వాళ్లను కూడా మళ్లీ రుణం తెచ్చుకోండి మాఫీ చేస్తాం అని ఎన్నికల ముందు రేవంత్రెడ్డి చెప్పారు. డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తానన్నారు. పది నెలలైంది. ఇప్పటికీ పైసా రుణం మాఫీ కాలేదు. ఎన్నికల ముందు ఎక్కడ దేవుడు కనిపిస్తే.. ఆ దేవుళ్ల మీద ఒట్లు వేశారు. ప్రజలనే కాదు దేవుళ్లను మోసం చేశారు. చిట్టినాయుడు కట్టేటోడు కాదు.. కూలగొట్టేటోడు. రైతుబంధు లేదు, రైతు భరోసా లేదు. పెద్ద మనుషులు, మహిళలకు పింఛన్లు అన్నారు. లేవు. మహిళలకు బతుకమ్మ చీరలు వచ్చాయా? పండుగ పండుగలా ఉందా? ఇందిరమ్మ ఇళ్లు కడతా అంటే ఓట్లు వేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఇళ్లు కూలగొడుతున్నారు. ఇలా అన్ని వర్గాలను మోసం చేశారు.బ్రదర్స్కు దోచిపెట్టేందుకే..మేం ఏడేళ్లపాటు కష్టపడి ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి 14 వేల ఎకరాలు సేకరించాం. ఈ సర్కారు ఫోర్త్ సిటీ కోసం ఒక్క ఎకరా కూడా సేకరించలేదు. ఫార్మా సిటీ భూములనే ఫోర్త్ సిటీ కోసం వాడే ప్రయత్నం చేస్తున్నారు. అది ఫోర్త్ సిటీ కాదు. రేవంత్రెడ్డి ఫోర్ బ్రదర్స్ సిటీ. వాళ్లు రైతులను బెదిరించి అసైన్డ్ భూములను లాక్కుంటున్నారు. ఫార్మా సిటీ రద్దు కాలేదని కోర్టుకు చెప్తున్నారు. బయట మాత్రం ఫోర్త్ సిటీ అంటున్నారు. ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందాకు ప్రయత్నం చేస్తున్నారు. ఫోర్త్ సిటీ పేరుతో చేస్తున్న డ్రామాలపై రైతులు కోర్టుల్లో కేసులు వేయాలి. వారికి బీఆర్ఎస్ లీగల్సెల్ అండగా నిలుస్తుంది. రీజనల్ రింగ్రోడ్డు అలైన్మెంట్ మార్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అస్మదీయులకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకే అలా వ్యవహరిస్తున్నారు. రేవంత్ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్లా పనిచేస్తున్నారే తప్ప.. సీఎంలా పనిచేయటం లేదు.ఎవరినీ వదిలిపెట్టేది లేదు..మూసీ గబ్బు అంతా సీఎం, మంత్రుల మెదళ్లలోనే ఉంది. వారి గబ్బు మాటలను ఇక వదిలేది లేదు. నాపై అడ్డగోలు గా మాట్లాడిన మంత్రిని వదిలిపెట్టను. క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా కూడా వేస్తా. గతంలో ప్రతి పక్షంలో ఉన్నారని ఏది మాట్లాడినా పెద్దగా పట్టించుకోలే దు. ఇకపై వారిని వదిలేది లేదు. మోదీనే ఏం చేసుకుంటావో చేసుకో అన్నోళ్లం. ఈ చిట్టి నాయుడు ఎంత?’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.సీఎంకు బతుకమ్మ అంటే గిట్టదా?‘‘ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి సీఎంకు మనసు రావడం లేదా? పండుగ పూట కూడా పల్లె లను పరిశుభ్రంగా ఉంచలేరా? చెత్తా చెదారం మధ్య మురికి కంపులో మన అక్కాచెల్లెళ్లు బతుకమ్మ ఆడుకో వాలా? పల్లెల్లో బ్లీచింగ్ పౌడర్ కొనడానికి, చెరువు కట్టమీద లైట్లు పెట్టడానికి పైసల్లేని పరిస్థితులు దాపు రించాయి. రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చింది? తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం?బతుకమ్మ చీరలను రద్దు చేశారు. బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా?’’ – ‘ఎక్స్’లో కేటీఆర్ విమర్శలు -
కొండా సురేఖకి అండగా ఉన్నాం
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ తాను అన్న మాటలను ఉపసంహరించుకున్న తరువాత కూడా చర్చ కొనసాగించడం అనవసరమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నా రు. శనివారం ఆయన గాంధీభవన్లో మీడి యాతో చిట్చాట్ చేస్తూ పలు అంశాలపై స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని నాగార్జున ఫ్యామిలీ కోరిన మేర కు మంత్రి వెంటనే స్పందించి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్ర కటించారని గుర్తు చేశారు. ఆ అంశం అంతటి తో ముగిసిపోయిందని, పీసీసీ అధ్యక్షుడు కూ డా సమస్య సద్దుమణిగిందని చెప్పిన తరు వాత కూడా మాట్లాడటం శోచనీయమని అ న్నారు. కొండా సురేఖ ఇబ్బంది పడ్డప్పుడు మాట్లాడనోళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆరోపించారు.సురేఖ ఒంటరి కాదని, బలహీ న వర్గాల మంత్రికి తామంతా అండగా ఉన్నా మని అన్నారు. కేంద్రం నుంచి పైసా తేలేని వారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలన్నారు. ఈ సంవత్స రం మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే బ తుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటికే బతుకమ్మ చీరలకు రూ. 150 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. విద్యార్థి సంఘం నాయకుడిగా రెసిడెన్షియల్ విద్యాసంస్థల సమస్యలపై సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చించానని, వారు సానుకూలంగా స్పందించారని పొన్నం వెల్లడించారు. -
కాలకేయ ముఠాలా మారారు: సీఎం రేవంత్
గన్ఫౌండ్రీ (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేసేందుకు ఏ కార్యక్రమం చేపట్టినా కొందరు కాలకేయ ముఠాలా అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. వాళ్లు గత పదేళ్లలో వందల ఎకరాల్లో ఫామ్హౌస్లు నిర్మించుకుంటే.. నిరుపేద ప్రజలు మాత్రం మురుగునీరు, కలుషిత వాతావరణంలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం మూసీ నిర్వాసితులకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శనివారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి (కాకా) 95వ జయంతి వేడుకలను నిర్వహించారు. సీఎం రేవంత్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ప్రజాప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుందే తప్ప అన్యాయం చేయబోదు. కొందరు వ్యక్తులు తమ ఫామ్హౌజ్లను రక్షించుకోవడం కోసం మూసీ నిర్వాసితులను ఒక రక్షణ కవచంలా వాడుకుంటున్నారు. వారి కుట్రలను అర్థం చేసుకోవాలి. మూసీ నిర్వాసితులను ప్రభుత్వం అనాథలను చేయదు. వారికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిదే. మూసీ రివర్, బఫర్ జోన్లలో ఉన్న నిరుపేదలను ప్రభుత్వం ఆదుకుంటుంది. పేదలకు మేలు చేసే విషయంలో విపక్ష నేతలతో సహా ఒక కమిటీ వేస్తాం. పేదలకు మేలు జరిగేలా తగు సూచనలు చేయాలి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సచివాలయానికి రావాలి. వారితోపాటు నేను, డిప్యూటీ సీఎం, అధికారులు కూర్చుందాం. మూసీ ప్రణాళికలపై చర్చిద్దాం. ప్రజలకు ఇళ్లు ఇస్తే మేలు జరుగుతుందా? లేక డబ్బులిస్తే మేలు జరుగుతుందా అనే విషయాలపై ఆలోచిద్దాం. మూసీని కాపాడుకోవాలి.. మూసీ నది, చెరువులు, కుంటలు చివరకు నాలాలను సైతం ఆక్రమించారు. ఇలాగే వదిలేస్తూ.. మూసీ నదిని మూసేద్దామా? 1908లో వరదలు వచ్చినప్పుడు జరిగిన విపత్తు వంటివి పునరావృతం కావొద్దంటే మూసీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. గుజరాత్లో సబర్మతి నదిని నరేంద్ర మోదీ ప్రక్షాళన చేస్తే చప్పట్లు కొట్టిన బీజేపీ నాయకులు.. మూసీ ప్రక్షాళన అంటే మాత్రం ఎందుకు సహకరించడం లేదు? ఆస్తుల లెక్కలు చూద్దామా? తెలంగాణ ప్రజల ఆస్తులు తగ్గుతుంటే.. గత ప్రభుత్వంలోని వారి ఆస్తులు ఎలా పెరిగాయి? 2004లో కేసీఆర్, 2005లో హరీశ్రావుల ఎన్నికల అఫిడవిట్ల నుంచి.. ఇప్పటి వాళ్ల ఆస్తుల వివరాలను చూద్దామా. కొందరు సోషల్ మీడియాతో అధికారంలోకి రావాలని కలలు కంటున్నారు. కానీ సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం ఏమోగానీ.. చర్లపల్లి జైలుకు వెళ్లడం మాత్రం ఖాయం. నిర్వాసితులకు మలక్పేట, అంబర్పేటల్లో ఇళ్లు మూసీ నిర్వాసితులకు మంచి జీవితాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మలక్పేట్లో ఉన్న రేస్కోర్స్, అంబర్పేటలో ఉన్న పోలీస్ అకాడమీలను హైదరాబాద్ శివార్లకు తరలిస్తాం. ఈ ప్రాంతాల్లో మూసీ నిర్వాసితులకు ఇళ్లు కట్టిద్దాం. కేటీఆర్, హరీశ్రావులకు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే.. వారికి ఉన్న వందల ఎకరాల ఫామ్హౌజ్ల నుంచి కొన్ని ఎకరాలను నిరుపేదలకు పంచి ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో రూ.1,500 కోట్లు ఉన్నాయి. అందులో నుంచి రూ.500 కోట్లు పేదలకు ఇవ్వొచ్చుకదా! బీఆర్ఎస్ హయాంలో కేవలం రూ.17 వేలకోట్లు రుణమాఫీ చేస్తే మేం నెల రోజుల్లోనే రూ.18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం. రైతులెవరూ రోడ్ల మీదికి రావొద్దు. ఏవైనా సమస్యలుంటే కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే సమస్య తీరిపోతుంది..’’అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ‘కాకా’ఆశయాలను కొనసాగిస్తాం తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్ది మందిలో కాకా వెంకటస్వామి ఒకరని సీఎం రేవంత్ కొనియాడారు. కాకా పేదల మనిషని, 80 వేల మందికిపైగా నిరుపేదలకు ఇళ్లు ఇప్పించిన, సింగరేణి సంస్థను కాపాడి కార్మికులకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి ఆయన అని చెప్పారు. గత ప్రభుత్వం కాకా జయంతిని అధికారికంగా జరపకుండా విస్మరించిందని విమర్శించారు. తాము కాకా ఆశయాలను కొనసాగిస్తామన్నారు. బలమైన లక్ష్యాలు ఉంటే పేదరికం, కులం అడ్డంకులు కావని కాకా నిరూపించారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అనంతరం జి.వెంకటస్వామిపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, నాగరాజు, ఎమ్మెల్సీ కోదండరామ్, ఎంపీలు అనిల్కుమార్ యాదవ్, మల్లురవి, గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైడ్రా ఆపితే హైదరాబాద్ మరో వయనాడ్ అవుతుంది: టీపీసీసీ చీఫ్
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో హైడ్రా ఆపితే హైదరాబాద్ మరో వయనాడ్ అవుతుందంటూ సంచలన కామెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అలాగే, ప్రభుత్వ స్థలాలు అక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టం అంటూ హెచ్చరించారు. ఇదే సమయంలో కొండా సురేష్, కేటీఆర్ అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో హైడ్రా, మూసీ యజ్ఞం ఏదీ ఆగదు. హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరిస్తాం. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టం. మా కుటుంబసభ్యులు కబ్జా చేసిన కూల్చేయండి. మూసీ సుందరీకరణపై ఇంకా డీపీఆర్ సిద్ధం కాలేదు. నిధులు ఎలా మళ్లిస్తాం. బీఆర్ఎస్ నేతలు దాదాపు 1500 చెరువులను కబళించారు. మూసీ సుందరీకరణ ప్రారంభానికి ముందే అవినీతి జరుగుతుందంటూ బీఆర్ఎస్ విమర్శలు అవివేకం. ఇప్పుడు జరుగుతుంది మూసీ ప్రక్షాళన మాత్రమే.రుణ మాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్న హరీష్ రావు మాట తప్పారు. సవాలు విసిరి వెనక్కి తగ్గారు. పదేళ్లలో బీఆర్ఎస్ రుణమాఫీకి ఇచ్చిన సొమ్మెంత.. కాంగ్రెస్ ఇచ్చిన సొమ్మెంతో హరీష్ చెప్పాలి. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాము.. తొమ్మిదినెలల్లోనే 18 వేల కోట్లు రుణమాఫీని ప్రభుత్వం చేసింది. దీనిపై చర్చకు మేం సిద్దమే..హరీష్ సిద్దమా?. ఏడున్నర లక్షలపైగా అప్పుతో బీఆర్ఎస్ మాకు రాష్ట్రాన్ని అప్పగించింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ చేశాం.కేటీఆర్ అమెరికాలో చదివాడా? లేక సర్టిఫికెట్ కొన్నాడా?. కేటీఆర్పై కోపంతో కొండా సురేఖ మాట్లాడారు. పీసీసీ సూచనతో వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. మాటల్లో తప్పులు దొర్లాయి కాబట్టి.. సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఈ వివాదానికి తెర లేపిందే కేటీఆర్. యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు. కానీ, రఘునందన్ రావు విషయంలో కొండా సురేఖపై దుబాయ్ నుంచి సోషల్ మీడియాలో తప్పుగా పోస్టు చేశారు. దానివల్లే సురేఖ అలా మాట్లాడారు. అయినా అలా మాట్లాడటం సరైంది కాదు కాబట్టి కొండా సురేఖ చెప్పాం. దీంతో, తన మాటలను ఉపసంహరించుకున్నారు. ఆ వివాదానికి ముగింపు పలకాలని సూచించాం. ఎవరు అయినా కోర్టుకు వెళ్ళే హక్కు ఉంటుంది. అందుకే నాగార్జున కూడా వెళ్లి అంటారు.త్వరలో నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ జరుగుతుంది. రాష్ట్ర మంత్రి వర్గంలో నిజామాబాద్కు తప్పుకుండా ప్రాతినిధ్యం దక్కుతుంది. పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశం లభిస్తుంది. నిజామాబాద్ స్మార్ట్ సిటీ జాబితాలో ఉండాల్సిందే. సాంకేతిక అంశాలు అన్నీ అనుకూలంగా ఉన్నా జాబితాలో రాలేదు. కొందరి అసమర్థత వల్ల జాబితాలో రాలేదు. స్మార్ట్ సిటీ జాబితాలో వచ్చేలా ప్రయత్నం చేస్తాం. జిల్లాలో మరో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నా. 2025 నాటికి సీఎంసీ మెడికల్ కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటాం అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: హరీష్.. కేసీఆర్ను తీసుకొచ్చే కెపాసిటీ ఉందా?: జగ్గారెడ్డి సవాల్ -
హరీష్.. కేసీఆర్ను తీసుకొచ్చే కెపాసిటీ ఉందా?: జగ్గారెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే ఇరు పార్టీల నేతలు ఆరోపణలు చేసుకున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. రుణమాఫీకి సిద్దమా? అని చాలెంట్ చేశారు.మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘రుణమాఫీపై హరీష్ రావుకు సవాల్ చేస్తున్నాను. రుణమాఫీపై చర్చకు బీఆర్ఎస్ సిద్దామా?. రుణమాఫీపై చర్చకు మల్లిగాడు, ఎల్లిగాడు కాకుండా కేసీఆర్ రావాలి. సీఎం రేవంత్ను ఒప్పించి చర్చకు నేను తీసుకువస్తాను. కేసీఆర్ను ఒప్పించి చర్చకు తీసుకువచ్చే కెపాసిటీ హరీష్కు ఉందా?. మాతో చర్చకు మీకు భయంగా ఉంటే.. సిద్దిపేటలోనే చర్చ పెట్టండి.రుణమాఫీ విషయంలో పబ్లిసిటీ చేయడంలో మేము ఫేయిల్ అయ్యాం. కానీ, బీఆర్ఎస్ మాత్రం పబ్లిసిటీలో పాస్ అయ్యింది. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదని మేమే చెబుతున్నాం. దీనిపై హరీష్ రావు సహా, బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆర్థిక శాఖను కేసీఆర్ దివాలా తీశారు. బీఆర్ఎస్ పాలన సమయంలో ఎనిమిది కిస్తీల్లో లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేకపోయారు. మేం పబ్లిసిటీ దగ్గర ఫెయిల్ అయ్యాం. రుణ మాఫీ అందని రైతులకు ఏ కారణాల వల్ల అందలేదో వివరాలు తెప్పించమని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు’ అని చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: రేవంత్.. ముందు రెడ్డికుంటలో నీ ఇల్లు కూల్చేవేయ్: కేటీఆర్ -
ముచ్చర్ల కేంద్రంగా ఫోర్త్ సిటీ కాదు.. ఫోర్ బ్రదర్స్ సిటీ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అన్ని వర్గాలను సీఎం రేవంత్ మోసం చేస్తున్నాడని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందిరమ్మ ఇళ్లు కడాతామంటే ఓట్లు వేశారు కానీ.. కూలగొట్టడానికి కాదంటూ మండిపడ్డారు. ఆరు గ్యారంటీలకు పైసలు లేవు కానీ.. మూసీ సుందరీకరణకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. బతుకమ్మ పండుగకు చీరలు రావు. పండుగను పండుగ మాదిరిగా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కందుకూరు వద్ద నిర్వహించిన రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ నేతలు కమీషన్లు కొట్టేయాలని చూస్తున్నారు. పథకాలు అమలు చేస్తే.. కమీషన్ రాదు.. అందుకే మూసీ అంటున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను రేవంత్ మోసం చేస్తున్నారు. మూసీ కంపు అంతా సీఎం రేవంత్ నోట్లోనే ఉంది. తప్పు చేయనప్పుడు భయపడేది లేదు. త్వరలోనే రేవంత్ మీద కూడా పరువు నష్టం దావా వేస్తాను. ఇప్పటికే మంత్రి మీద కేసు వేశాను. మోదీకే భయపడలేదు.. చిట్టి నాయుడుకి భయపడతామా?.నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొడంగల్ రెడ్డికుంటలో ఉన్న నీ ఇల్లు కూల్చు. పైసల పిచ్చి ఉంటే.. నాలుగు కోట్ల మంది చందాలు వసూలు చేసి రేవంత్కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీకి కప్పం కట్టడానికి.. కుర్చీ కాపాడుకోవడానికి చందాలు వేసి ఇద్దాం.. కానీ పేద ప్రజల దగ్గరకు మాత్రం రావద్దు. నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిలబడితే కనీసం కనికరం లేదు. సామాన్యులను తప్పించుకొని ఎక్కువ రోజులు పాలన చేయలేరు. కందుకూరు రైతు ధర్నా స్ఫూర్తితో ప్రతీ పల్లెలో ఆందోళనకు సిద్ధం కావాలి.ముచ్చర్ల కేంద్రంగా రేవంత్రెడ్డి చేసేది ఫోర్త్ సిటీ కాదు.. ఫోర్ బ్రదర్స్ సిటీ. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడానికి మంత్రి కోమటిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. 2015 నుంచి 2022 వరకు ఎంతో శ్రమించి ఫార్మా సిటీ కోసం రైతుల నుంచి 14 వేల ఎకరాల భూమిని బీఆర్ఎస్ సేకరించింది. ఆ భూములు ఫార్మా సిటీకి తప్ప.. ఫ్యూచర్ సిటీకి వినయోగించడానికి వీలు లేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిరుపేదల భూములను గుంజుకోవడమే పనిగా పెట్టుకుంది. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో ఫ్యూచర్ సిటీ ఎలా కడతారు?. ఏఐ సిటీ, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారు.రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. అర్హులైన రైతులందరికీ వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి. ఒక్కో ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇవ్వాలి. వడ్లకు బోనస్ ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు. కనీస మద్దతు ధరకు అదనంగా వరికి 500 రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేస్తున్నారు. పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వడం లేదు. ఇచ్చిన ప్రతీ హామీని కాంగ్రెస్ నేతలు విస్మరించారు’ అని విమర్శలు చేశారు.ఇది కూడా చదవండి: కబ్జాల కారణంగా మూసీ మూసుకుపోతోంది: సీఎం రేవంత్ -
ఫామ్హౌస్లు కాపాడుకునేందుకు దీక్షలా?: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కబ్జాల కారణంగా మూసీ పూర్తిగా మూసుకుపోతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీ ప్రాంతాల్లో ఉన్న వాళ్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఫామ్హౌస్లను కాపాడుకునేందుకు కొందరు దీక్షలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు.వెంకటస్వామి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ పూర్తిగా కాంక్రీట్ జంగిల్గా మారిపోయింది. చెరువుల ఆక్రమణతో మన బ్రతుకులు సర్వనాశనమవుతున్నాయి. బఫర్ జోన్లో ఉన్న వాళ్లకు ప్రత్యామ్నాయం చూపిస్తాం. చెరువుల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్నవాళ్లు మిమ్మల్ని ఏరకంగా ఆదుకోవాలో ప్రభుత్వానికి సూచన చేయండి. ప్రతిపక్షాల సూచనలను స్వీకరిస్తాం. మూసీ పరివాహక పేదలను ఆదుకునేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉంది. ఈటల రాజేందర్, కేటీఆర్, హరీష్ రావుకు సూచన చేస్తున్నా. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకుందామో సూచనలు ఇవ్వండి. మా ప్రభుత్వానికి ఎవరిపైనా కోపం లేదు. ప్రజలకు మేలు చేయడమే మా ప్రభుత్వ ఎజెండా అని అన్నారు ..కబ్జాల వల్ల మూసీ మూసుకుపోతోందని, అందువల్లే ప్రక్షాళన మొదలుపెట్టాం. మూసీ నిర్వాసితులను అనాథలను చేయం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. వలస వచ్చిన వాళ్లకు మంచి జీవితాన్ని ఇవ్వడమే మా లక్ష్యం. కొందరు కావాలనే పేదలను రెచ్చగొడుతున్నారు. పేదలను రెచ్చగొట్టడం మానేసి నిర్వాసితులను ఆదుకునేందుకు సలహాలివ్వండి. తెలంగాణ ప్రజల ఆస్తులు తగ్గుతుంటే.. ప్రతిపక్ష నేతల ఆస్తులు ఎలా పెరిగాయి?. ఫామ్హౌస్లను కాపాడుకునేందుకు కొందరు దీక్షలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయి. పేదలకు రూ.500 కోట్లు ఇవొచ్చు కదా?. అంబర్పేటలో 200 ఎకరాల భూమి ఉంది. అది పేదలకు పంచుదాం.. ప్రతిపక్ష నేతలు ఏమంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మంచి కోసమే పనిచేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సబర్మతీ నదిని అభివృద్ధి చేస్తే చప్పట్లు కొట్టి గొప్పలు చెబుతున్నారు. మరి సబర్మతిలా మూసీని అభివృద్ధి చేస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి?. కేసీఆర్, కేటీఆర్కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే ఫామ్ హౌస్లో కొంత భూమిని పేదలకు దానం చేయండి. పేదోళ్లకు ఏం చేద్దామో ఆలోచన చేద్దాం ముందుకు రండి. మీ ఆస్తులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. మీ అనుభవంతో ఏం చేద్దామో చెప్పండి. అంతే కానీ.. ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాలా అడ్డుపడటం సరికాదు. ఐదేళ్లలో వాళ్లు చేసిన రుణమాఫీ కేవలం 11వేల కోట్లు.. నెలరోజుల్లో మేం 18వేల కోట్లు రైతు రుణమాఫీ చేసాం. దయచేసి రైతులెవరూ రోడ్డెక్కొద్దు.. సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి. సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని కొందరు కలలు కంటున్నారు. సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు.. వాళ్లు చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయం అంటూ హెచ్చరించారు. ఇది కూడా చదవండి: ‘జీహెచ్ఎంసీ’పై మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన -
హోం మంత్రి పదవి ఇవ్వాలని..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దసరాకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న చర్చ బయటకు రావడంతో రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. అప్పుడు విస్తరణ జరగలేదు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఢిల్లీ వెళ్లిన సందర్భంలోనూ మంత్రివర్గ విస్తరణపైనే అధిష్టానంతో చర్చించారని వార్తలు వచ్చాయి. అప్పటికప్పుడు నిర్ణయం వెలువడకపోయినా దసరాకు ముందు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాల్లో ఊగాహానాలు జోరందుకున్నాయి. దీంతో మంత్రి వర్గంలో రాజగోపాల్రెడ్డికి బెర్త్ ఖాయమనే చర్చ మళ్లీ మొదలైంది.ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి..మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రి పదవి వస్తుందని భావిస్తూ వస్తున్నారు. కానీ, మొదట్లో ఉమ్మడి జిల్లా నుంచి తన సోదరుడైన కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి, ఉత్తమ్కుమార్రెడ్డికి మంత్రి పదవులు వచ్చాయి. ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణలో రాజగోపాల్రెడ్డికి తప్పకుండా అవకాశం దక్కుతుందని జోరుగా చర్చ సాగింది. అయితే పది నెలలు అవుతున్నా మంత్రివర్గ విస్తరణ జరగనే లేదు. మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి రాజగోపాల్రెడ్డి పేరు ప్రస్తావనకు వస్తోంది.ఎంపీ ఎన్నికల సందర్భంలో అధిష్టానం హామీపార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఢిల్లీ, రాష్ట్ర అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా రాజగోపాల్రెడ్డి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. రాహుల్గాంధీ ప్రధాని కావాలంటే రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించాలని అధిష్టానం, రాష్ట్ర పార్టీ నేతలు, ముఖ్యమంత్రి కలిసి నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపికతోపాటు వారి గెలుపు బాధ్యతలను జిల్లాల్లోని ముఖ్య నేతలకు అప్పగించారు. అందులో భాగంగా భువనగిరి ఎంపీగా చామల కిరణ్కుమార్రెడ్డిని గెలిపించే బాధ్యతను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి సీఎం రేవంత్రెడ్డి అప్పగించారు. ఆ సమయంలో ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా చర్చ జరిగింది. మొత్తానికి భువనగిరి ఎంపీగా చామల కిరణ్కుమార్రెడ్డిని దగ్గరుండీ గెలిపించారు. అప్పటి నుంచి మంత్రి పదవి కచ్చితంగా వస్తుందని రాజగోపాల్రెడ్డి భావించినా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగలేదు. అయితే, దసరాకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపధ్యంలో అధిష్టానం హామీ మేరకు రాజగోపాల్రెడ్డికి బెర్త్ దక్కుతుందా అన్న చర్చ మళ్లీ జోరందుకుంది.హోం మంత్రి పదవి ఇవ్వాలని..!ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు ప్రతిపక్ష, అటు అధికార పక్షాల మధ్య పోటాపోటీగా అసెంబ్లీలో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వ వేదికలతోపాటు రాజకీయ వేదికల్లోనూ పెద్ద ఎత్తున అధికార, ప్రతిపక్షాలు పోటా పోటీగా విమర్శలు చేసుకున్నాయి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అధికార పక్షం, పాలన చేత కాక గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుందని ప్రతిపక్షం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తనకు హోంమంత్రి పదవి ఇవ్వాలని, తాను హోంమంత్రి అయితేనే కేసీఆర్ను సమర్థంగా ఎదుర్కొంటానని రాజగోపాల్రెడ్డి పలు సమావేశాల్లోనూ చెప్పుకొచ్చారు.ఎస్టీ కోటాలో బాలునాయక్కు!ఎస్టీ లంబాడా కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్కు మంత్రి పదవి వస్తుందని చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఆదివాసీ గిరిజన కోటాలో సీతక్కకు అధిష్టానం అవకాశం కల్పించింది. లంబాడా కోటాలో మరొక మంత్రి పదవి ఇస్తారన్న చర్చ సాగుతోంది. -
‘మూసీ’ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరిట అవినీతి ఆలోచనలు మానుకొని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్రెడ్డి దృష్టి పెట్టాలంటూ లేఖ రాసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేస్తూ.. మరోసారి ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు.‘‘మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు?. రైతు బంధు ఎగ్గొట్టి, మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు?. మహిళలకు వంద రోజుల్లోనే నెలకు 2500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరు?. అవ్వ, తాతలకు నెలకు 4000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు?. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగావీరుడు ఎవరు?. మూసి బ్యూటిఫికేషన్ పేరిట 1,500,000,000 కోట్ల లూటిఫికేషన్కి తెరతీసిన ఘనుడు ఎవరు?’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.కాగా, మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామంటున్న ముఖ్యమంత్రికి రైతు భరోసా, దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చేందుకు డబ్బులు లేవా? అంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ దుయ్యబట్టారు. సీఎం నిర్వహించిన వ్యవసాయ సమీక్షలో దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్, వర్షాకాలంలో రైతు భరోసా వంటి అంశాలపై చర్చించలేదని విమర్శించారు.ఇదీ చదవండి: సర్కార్పై సమరానికి సై!గత సీజన్లోనూ రైతులకు వరి ధాన్యంపై బోనస్ చెల్లించకుండా ప్రభుత్వం మోసగించిందని ఆరోపించారు. కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే ప్రకటనతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. 80 శాతం మంది రైతులు దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి కూడా కేవలం సన్న వడ్లకే ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వకుంటే రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ హెచ్చరించారు. -
తుంగతుర్తి కాంగ్రెస్లో ముసలం.. రహస్య ప్రాంతంలో అసమ్మతి నేతలు
సాక్షి, సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో లొల్లి కొనసాగుతోంది. ఎమ్మెల్యే మందుల సామేల్కు వ్యతిరేకంగా ఉదయం 11 గంటలకు జాజిరెడ్డిగూడెంలో అసమ్మతి వర్గం సమావేశం సమావేశం కానుంది. దగా పడ్డా కాంగ్రెస్ సీనియర్ ల్లారా కదలిరండి పేరుతో కార్యక్రమం చేపట్టారు. డీసీసీ ఉపాధ్యక్షుడు యోగానంద చారి అధ్యక్షతన సమావేశం జరగనుంది. గత కొంతకాలంగా సామేల్, యోగానంద చారి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. గతంలో జాజిరెడ్డిగూడెం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా యోగానంద నిరసన కార్యక్రమం చేయించారు. అసమ్మతి వర్గం వెనుక ఓ మాజీ మంత్రి ఉన్నట్లు ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు.కాగా, జాజిరెడ్డిగూడెంలో కాంగ్రెస్ అసమ్మతి నేతలను ముందస్తు అరెస్ట్ చేసినట్లు సమాచారం. జాజిరెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు మోరపాక సత్యం, తుంగతుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్రెడ్డితో పాటు పలువురు నేతలను అరెస్టు చేసి రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.అసమ్మతి నేతలను ముందస్తు అరెస్ట్ చేశారని.. కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యే అవకాశం కూడా పార్టీలో లేదా అంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. సామేల్ కాంగ్రెస్లో ఉన్నారా? బీఆర్ఎస్లో ఉన్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్ చేసిన నేతలను విడిచిపెట్టకపోతే జాజిరెడ్డిగూడెం బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: సర్కార్పై సమరానికి సై! -
అవినీతి మానేసి హామీలపై దృష్టిపెట్టండి
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరిట అవినీతి ఆలోచనలు మానుకొని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు హితవు పలికారు. మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామంటున్న ముఖ్యమంత్రికి రైతు భరోసా, దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చేందుకు డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ దుయ్యబట్టారు.ఈ మేరకు సీఎం రేవంత్కు కేటీఆర్ శుక్రవారం లేఖ రాశారు. సీఎం నిర్వహించిన వ్యవసాయ సమీక్షలో దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్, వర్షాకాలంలో రైతు భరోసా వంటి అంశాలపై చర్చించలేదని విమర్శించారు. గత సీజన్లోనూ రైతులకు వరి ధాన్యంపై బోనస్ చెల్లించకుండా ప్రభుత్వం మోసగించిందని ఆరోపించారు. కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే ప్రకటనతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. 80 శాతం మంది రైతులు దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి కూడా కేవలం సన్న వడ్లకే ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వకుంటే రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ హెచ్చరించారు.రైతు భరోసా సంగతి తేల్చండి: వానాకాలం సీజన్ పూర్తయినా ప్రభు త్వం రైతు భరోసా సంగతి తేల్చడం లేదని కేటీఆర్ లేఖలో మండిపడ్డారు. రైతుబంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామనే హామీని విస్మరించిందని, నేటికీ రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని దుయ్యబట్టారు. రైతులకు బాకీ పడిన రైతు భరోసాను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 100 శాతం రుణమాఫీ చేస్తామని ప్రకటించినా 20 లక్షల మంది రైతులకు నేటికీ మాఫీ వర్తించలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా రైతులకు మేలు జరగట్లేదని.. రేవంత్ చేతకానితనం అన్నదాతలకు శాపంగా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. -
కార్యకర్తల కృషి వల్లే పీసీసీ పీఠం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సాధారణ కార్యకర్త నుంచి అత్యున్నత స్థాయి పదవుల వరకు చేరుకోవాలంటే కాంగ్రెస్ పారీ్టతోనే సాధ్యమని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్గౌడ్ అన్నారు. తనకు పీసీసీ పీఠం దక్కడమే ఇందుకు నిదర్శనమని.. ఈ గౌరవం కార్యకర్తల కృషి ఫలితమేనని చెప్పారు. శుక్రవారం నిజామాబాద్లోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో మహేశ్కుమార్ గౌడ్ సన్మాన సభ జరిగింది. ఈ సభకు సగానికిపైగా మంత్రివర్గం తరలివచ్చి0ది. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. తండ్రి మరణంతో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, విదేశాల్లో ఉండటంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీతక్క, జూపల్లి కృష్ణారావు రాలేకపోయారు. ఈ సందర్భంగా మహేశ్కుమార్ మాట్లాడుతూ 38 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక కష్టనష్టాలు చవిచూశానని.. కానీ కష్టపడినందుకు పార్టీ నాయకత్వం గుర్తించి కలలో కూడా ఊహించని రీతిలో వడ్డీతో సహా పీసీసీ పీఠం అప్పగించిందన్నారు. డీఎస్ ఆశీర్వాదం తీసుకొనేవాడిని.. దివంగత మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్తో తనకు కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ రాజకీయ గురువుగానే భావిస్తానని మహేశ్కుమార్గౌడ్ అన్నారు. కరాటే మాస్టర్గా ఉన్న తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రోత్సహించిన డీఎస్.. 1986లో తనను ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా చేశారని గుర్తుచేసుకున్నారు. ఒకవేళ డీఎస్ బతికి ఉంటే పీసీసీ చీఫ్ హోదాలో వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకొనేవాడినని చెప్పారు. సోషల్ ఇంజనీరింగ్తో ముందుకు.. రాహుల్ గాంధీ ఆలోచనా విధానంతో ముందుకు వెళతామని మహేశ్కుమార్గౌడ్ అన్నా రు. ఇందులో భాగంగానే సోషల్ ఇంజనీరింగ్, బీసీ గణన జరుగుతోందని చెప్పారు. ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలందరికీ న్యాయం చేస్తామన్నారు. 2028 ఎన్నికల్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో కలిసి రాష్ట్రంలో 90 నుంచి 100 అసెంబ్లీ సీట్లు, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తామని జోస్యం చెప్పారు. పీసీసీ కమిటీలో, డీసీసీల్లో 60 శాతం బీసీలకే పదవులు.. పీసీసీ కమిటీతోపాటు జిల్లా కాంగ్రెస్ కమిటీల్లోనూ 60 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారికే కేటాయించనున్నట్లు మహేశ్గౌడ్ తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు కొదవ లేదన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎలాంటి రాజకీయ అండ లేనప్పటికీ పార్టీ అత్యున్నత గుర్తింపు ఇచ్చి0దని చెప్పారు. కార్యకర్తలకు ఎలా న్యాయం చేయాలో కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసన్నారు. కార్యకర్తలే కాంగ్రెస్ బలం: దీపాదాస్ మున్షీకాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని బలమన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ బలహీనంగా ఉందని గతంలో విన్నానని.. కానీ అభినందన సభకు ఇంత భారీగా కార్యకర్తలు, అభిమానులు రావడం చూస్తుంటే పార్టీ బలం పుంజుకుంటున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. -
నా ఫామ్హౌస్కు అధికారులను పంపండి
సాక్షి, హైదరాబాద్: తన ఫామ్హౌస్లోని ఏ కట్టడమైనా ఒక్క అంగుళం ఎఫ్టీఎల్ లేదా బఫర్జోన్లో ఉన్నా సొంత ఖర్చులతో కూల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచందర్రావు ప్రక టించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నాకు చట్టం నుంచి ఏ మినహాయింపులు వద్దు. ఒక సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఏవిధంగా వ్యవహరిస్తుందో, అదే విధంగా వ్యవహరిస్తే చాలు. ఎక్కువ–తక్కువలు అవసరం లేదు.మీరు, నేను కలగజేసుకోకుండా చట్టాన్ని తన పని చేసుకుపోనిద్దాం’’అని పేర్కొంటూ శుక్రవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డికి కేవీపీ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డపేరు తేవడానికి తనలో నరనరాన ఉన్న కాంగ్రెస్ రక్తం అంగీకరించనందునే ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తగా ప్రాంతాలకు అతీతంగా జాతీయ పార్టీ కాంగ్రెస్ బలోపేతానికి తన శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. మూసీ ప్రక్షాళనను స్వాగతిస్తున్నా.. హైదరాబాద్ శివార్లలోని అజీజ్నగర్లో ఉన్న తన ఫామ్హౌస్కు సంబంధిత అధికారులను పంపాలని.. వారు చట్టప్రకారం మార్క్ చేస్తే ఆ పరిధిలో కట్టడాలేవైనా ఉంటే 48 గంటల్లో కూల్చి, ఆ వ్యర్థాలను కూడా తొలగిస్తానని కేవీపీ లేఖ లో పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి భారం పడనివ్వబోనని తెలిపారు. అయితే మార్కింగ్ ప్రక్రి య పారదర్శకంగా జరగాలని.. తేదీ, సమయాన్ని ముందే ప్రకటిస్తే ప్రతిపక్ష నాయకులు కూడా తీరిక చేసుకుని వచ్చి వీక్షించే అవకాశం కలుగుతుందని వెల్లడించారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణను స్వాగతిస్తున్నానని తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు వారి స్వప్రయోజనాలను కాపాడుకోవడం కోసమే మాట్లాడుతున్నారని, వారిది మొసలి కన్నీరని విమర్శించారు.‘‘బీఆర్ఎస్, బీజేపీ నేతలు మీ భుజంపై తుపాకీ పెట్టి నన్ను కాల్చాలని, తద్వారా మిమ్మల్ని ఇరుకున పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. వారు కాంగ్రెస్ సీఎంపై నిరాధార ఆరోపణలు చేయడానికి నన్ను, మా ఫామ్హౌస్ను పావుగా వాడుకోవడం మనోవేదన కలిగిస్తోంది. నేను కాంగ్రెస్లో క్రమశిక్షణ గల కార్యకర్తను. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని త్రికరణ శుద్ధిగా సమరి్థస్తాను. ఈ విషయాన్ని ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి చెప్పవలసి రావడం బాధాకరమే అయినా తప్పడం లేదు’’లేఖలో కేవీపీ పేర్కొన్నారు. -
కేసీఆర్ది రైతు గుండె.. రేవంత్ రెడ్డిది రాతి గుండె
సాక్షి, మహబూబాబాద్: ‘తెలంగాణ సాధించిన కేసీఆర్.. పదేళ్ల పాలనలో రైతు పక్షపాతిగా ఉన్నారు. ఆయనది రైతుగుండె.. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను మోసగించిన సీఎం రేవంత్రెడ్డిది రాతి గుండె’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. అందరికీ రుణమాఫీ చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్లతో శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బీఆర్ఎస్ రైతు మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో హరీశ్రావు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు కల్ల్లబొల్లి మాటలు చెప్పి, నేనే మొనగాడిని.. రాష్ట్రాన్ని బాగుచేసేది నేనే అని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి అసలు స్వ రూపం బయట పడిందన్నారు. ఆయన మొనగాడు కాదు .. మోసగాడని ప్రజలు గ్రహించారని చెప్పారు. రుణ మాఫీ పై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒకతీరు.. మంత్రి తు మ్మల మరోతీరు మాట్లాడి రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. సీఎం మాటలు నమ్మిన రైతులు రూ.2 లక్షలకు పైగా ఉన్న అప్పులు చెల్లించారని, రుణమాఫీ అవుతుందని అధిక వడ్డీకి డబ్బులు తెచ్చి ఇప్పు డు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు సీఎం రేవంత్రెడ్డిని, ప్రభుత్వాన్ని విడిచి పెట్టేది లేదని హరీశ్ అన్నారు. హామీల అమలుకు దసరా తర్వాత ఢిల్లీలోని రాహుల్గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంత్రుల్ని, ఎమ్మెల్యే లను నిలదీయాలని ఆయన పిలుపు నిచ్చారు. కాగా, ధర్నా సందర్భంగా ఓ తొండ తాటికొండ రాజయ్య చొక్కాలోకి వెళ్లడంతో కార్యకర్తలు అప్రమత్తమై దానిని తీసివేశారు. దీంతో కొంతసేపు నవ్వులు విరిశాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మధుసూదనాచారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత తదితరులు పాల్గొన్నారు. -
ఆవేశంలో ఉన్నా ఆలోచించి మాట్లాడాలి.. సురేఖకు డీకే అరుణ చురకలు
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలని కొండా సురేఖకు హితవు పలికారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఆవేశం వచ్చినా రాజకీయ నాయకులు ఆలోచించి మాట్లాడాలన్నారు. ఒక మహిళను పట్టుకొని, సినిమా కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడం కరెక్ట్ కాదంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, ఎంపీ డీకే అరుణ శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ క్రమంలో డీకే అరుణ మాట్లాడుతూ.. కొండా సురేఖతో నాకు మంచి అనుబంధం ఉంది. గతంలో ఇద్దరం కలిసి మంత్రులుగా పనిచేశాం. కానీ, ఒక సినీ కుటుంబంపై ఆమె చేసిన ఆరోపణలు అభ్యంతరకరం. సినిమా పరిశ్రమలో ఆ కుటుంబానికి ప్రత్యేక పేరు ఉంది. ఎవరి వ్యక్తిగత విషయాలతో రాజకీయాలు ముడిపెట్టడం సరికాదు.రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. ఒకసారి మాట్లాడి మళ్లీ వెనక్కు తీసుకోలేము. రాజకీయ నాయకులు ఆవేశం వచ్చినా ఆలోచించి మాట్లాడాలి. ఒకరి మీద కోపం ఇంకొకరి మీద తీయడం సరికాదు. ఒక మహిళను పట్టుకొని, సినిమా కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడం కరెక్ట్ కాదు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆగ్రహానికి రేవంత్ ప్రభుత్వం గురికావద్దు. అమ్మవారి ఆలయం దగ్గర మహిళలు బతుకమ్మ ఆడటానికి కోర్ట్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. తెలంగాణలో మళ్లీ నియంతృత్వ పాలనా సాగుతుంది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఎన్నికల హామీలు విఫలమై హైడ్రా.. చివరకు సినీ తారలు: జగదీష్ రెడ్డి