గ్రామస్తులకు కంటిమీద కునుకులేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు.
కర్నాటక రాష్ట్రం దొడ్డ బళ్లాపురం తాలూకాలోనిమాడేశ్వర గ్రామం,చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు గత కొన్ని రోజులుగా కంటిమీద కునుకులేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. దీంతో గ్రామాల ప్రజలు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.
వారం రోజులుగా చిరుతపులి గ్రామ శివార్లలో మేస్తున్న గొర్రెలు, ఇతర ప్రాణులను బలితీసుకుంటోంది. దీంతో, పాడి రైతులు పశువులను మేతకు వదలడానికే జంకుతున్నారు. పొలాల్లో పనులకు వెళ్లేందుకు సైతం ఇబ్బందిగా మారింది. గ్రామస్తులు ఇంటికే పరిమితమూ పోయారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు వలపన్ని చిరుతను పట్టుకున్నారు.