వరంగల్ జిల్లా సంగెం మండలం నార్లవాయిలో విషాదం చోటు చేసుకుంది.
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
Oct 24 2016 2:07 PM | Updated on Oct 1 2018 2:36 PM
సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలం నార్లవాయిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దేవులపల్లి రవి(36) అనే రైతు అప్పులబాధతాళలేక ఆదివారం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందాడు. ఇటీవల కురిసిన భారీవర్షాలకు పంట దెబ్బతిని సుమారు రూ. 3 లక్షల అప్పు అయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆ బాధతోనే రవి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement