అఫ్గాన్‌ ఒక్క టెస్టు మ్యాచ్‌ గెలిస్తే చాలు: ధావన్‌ | We will be fresh before going to Ireland, Shikhar Dhawan | Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌ ఒక్క టెస్టు మ్యాచ్‌ గెలిస్తే చాలు: ధావన్‌

Jun 16 2018 10:58 AM | Updated on Mar 28 2019 6:10 PM

We will be fresh before going to Ireland, Shikhar Dhawan - Sakshi

బెంగళూరు: అఫ్గానిస్తాన్‌ టెస్టు తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సూచించాడు. బెంగళూరు వేదికగా భారత్, అఫ్గానిస్తాన్‌ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. ఈ టెస్టులో శిఖర్ ధావన్, మురళీ విజయ్ శతకాలు సాధించగా.. బౌలింగ్‌లో అశ్విన్, జడేజా చెలరేగడంతో అఫ్గానిస్థాన్ జట్టు ఇన్నింగ్స్, 262 పరుగుల భారీ తేడాతో భారత్ చేతిలో ఓడిపోయింది.

మ్యాచ్‌ తర్వాత ధావన్‌ మాట్లాడుతూ.. ‘క్రికెట్‌లో అఫ్గానిస్తాన్‌ ఈ స్థాయికి వచ్చినందుకు నేను అభినందిస్తున్నా. ఆ జట్టు తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ప్రత్యర్థి జట్టుతో ఆడి ఓసారి అఫ్గానిస్థాన్ విజయం సాధిస్తే చాలు.. ఆటోమేటిక్‌గా ఆ జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పటికే భారత జట్టుతో టెస్టు ఆడటం ఆ జట్టులో కచ్చితంగా ఉత్సాహం నింపేదే. మ్యాచ్‌ని చూసేందుకు వచ్చిన అభిమానులకి  ధన్యవాదాలు. ఇక మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగియడంతో ఐర్లాండ్‌ పర్యటనకు ముందు భారత జట్టుకి ఎక్కువ విశ్రాంతి లభించనుంది’ అని ధావన్ వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement