
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ.. సన్రైజర్స్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించాడు. అయితే ఈ మ్యాచ్లో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ సీజన్లో ఇప్పటివరకూ హైదరాబాద్ ఆడిన ఐదు మ్యాచ్లను పరిశీలిస్తే.. సన్రైజర్స్ తొలిసారి బ్యాటింగ్ చేపట్టింది.
దాంతో మొదటిసారి లక్ష్యాన్ని నిర్దేశించనుంది. ముందుగా ఫీల్డింగ్ చేయడమే ఇష్టమని సన్రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ చెప్పినప్పటికీ, టాస్ ఓడిపోవడంతో బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ముంబై ఇండియన్స్ మొదటిసారి ఛేజింగ్ చేయనుంది. ముంబై ఆడిన గత ఐదు మ్యాచ్ల్లో ముందుగా బ్యాటింగ్ చేసింది. తాజా మ్యాచ్లో తొలిసారి లక్ష్యాన్ని ఛేదించనుంది.