దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ రెండో టెస్టు డ్రా
కేప్టౌన్: దాదాపు ఏడాదిన్నర క్రితం దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన హషీం ఆమ్లా అనూహ్యంగా రాజీనామా చేశాడు. ఇంగ్లండ్తో బుధవారం ముగిసిన రెండో టెస్టు అనంతరం అతను ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇటీవల భారత్తో ఘోర పరాజయం ఎదురుకావడం... ఇంగ్లండ్తో స్వదేశంలో సిరీస్లోనూ తన నిర్ణయాలపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గ్రేమ్ స్మిత్ వారసుడిగా పగ్గాలు స్వీకరించిన ఆమ్లా తన తొలి మూడు సిరీస్లలో (శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్) జట్టుకు విజయం అందించగా, ఆ తర్వాత బంగ్లాదేశ్తో సిరీస్ వర్షం కారణంగా ఫలితం తేలలేదు.
భారత్లో నాలుగు టెస్టుల ఈ సిరీస్లో జట్టు 0-3తో చిత్తుగా ఓడింది. సొంతగడ్డపై కూడా ఇంగ్లండ్ చేతిలో తొలి టెస్టులో ఘోరంగా ఓడింది. రెండో టెస్టులో తన డబుల్ సెంచరీతో జట్టును ఆదుకున్నా... కెప్టెన్సీకి మాత్రం ఆమ్లా గుడ్బై చెప్పాడు. ఈ సిరీస్లో అతని వ్యూహాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ‘నా ఆటపై దృష్టి పెట్టేందుకు ఎంతో కష్టంగా అనిపించినా సరే ఈ నిర్ణయం తీసుకున్నా. నాకంటే మెరుగ్గా కెప్టెన్సీ చేసేవారు ఉన్నారనే నమ్మకం ఉంది’ అని ఆమ్లా చెప్పాడు. సిరీస్లో మిగతా రెండు టెస్టులకు డివిలియర్స్ నాయకత్వం వహిస్తాడు.
ఆదుకున్న బెయిర్స్టో
చివరి రోజు కాస్త ఉత్కంఠ రేపినా... ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు డ్రాగానే ముగిసింది. మ్యాచ్ ముగిసే సరికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 116 పరుగుల వద్దే జట్టు ఆరో వికెట్ కోల్పోయినా... బెయిర్ స్టో (30 నాటౌట్), అలీ (10 నాటౌట్) కలిసి మరో 23.4 ఓవర్లు ఆడారు. వెలుతురు మందగించడంతో అంపైర్లు మ్యాచ్ను ముం దే నిలిపేశారు. సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. మూడో టెస్టు 14 నుంచి జరుగుతుంది.
కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఆమ్లా
Published Thu, Jan 7 2016 1:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement