ఆంధ్ర, హిమాచల్ ప్రదేశ్ జట్ల మధ్య బుధవారం ఇక్కడ ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్కు ప్రతికూల వాతావరణం అంతరాయం కలిగించింది.
హిమాచల్ప్రదేశ్తో రంజీ మ్యాచ్
ధర్మశాల: ఆంధ్ర, హిమాచల్ ప్రదేశ్ జట్ల మధ్య బుధవారం ఇక్కడ ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్కు ప్రతికూల వాతావరణం అంతరాయం కలిగించింది. ఫలితంగా మొదటి రోజు 34 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. తొలి రోజు ముగిసే సమయానికి ఆంధ్ర 2 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఎం. శ్రీరామ్ (91 బంతుల్లో 45 బ్యాటింగ్; 5 ఫోర్లు), కెప్టెన్ కైఫ్ (1 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. కేఎస్ భరత్ (82 బంతుల్లో 47; 6 ఫోర్లు), ప్రశాంత్ (7) వెనుదిరిగారు.