అక్బరుద్దీన్ అంతగా మారిపోయాడా? | Taslima Nasreen Fires On Akbaruddin Owaisi | Sakshi
Sakshi News home page

అక్బరుద్దీన్ అంతగా మారిపోయాడా?

Feb 10 2020 8:15 PM | Updated on Feb 10 2020 8:36 PM

Taslima Nasreen Fires On Akbaruddin Owaisi - Sakshi

హైదరాబాద్‌: పాతబస్తీలోని లాల్‌ దర్వాజా సింహవాహిని మహంకాళీ అమ్మవారి ఆలయం అభివృద్ధికి నిధులను కోరుతూ.. చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కలవడంపై మిశ్రమ స్పందన వస్తోంది. తాజాగా బంగ్లాదేశ్‌ వివాదాస్పద రచయిత తస్లీమా నస్రీన్‌ కూడా అక్బరుద్దీన్‌పై విమర్శలు సంధించారు.

'గతంలో హిందువుల పట్ల చులకనగా మాట్లాడటమే కాక 15 నిమిషాలు పోలీసులు కళ్లు మూసుకుంటే హిందూ, ముస్లిం జనాభాను సమానం చేస్తానన్న ఆయన ఇంత మంచి మనిషిగా ఎప్పుడు మారిపోయారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్ ఇప్పుడు మహంకాళి ఆలయ అభివృద్ధికి రూ. 10 కోట్లు ఇవ్వాలని కోరుతున్నాడు. అతడు ముఖానికి మాస్క్ తగిలించుకున్నాడా? లేకపోతే మంచిమనిషిగా మారాడా?' అంటూ ఆమె ట్వీట్ చేశారు. తనకు స్వేచ్ఛ కలిగితే దేశంలో హిందూ ముస్లింల జనాభాను సమానం చేస్తానని అక్బరుద్దీన్ ఇదివరకు పలుమార్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేసులు కూడా నమోదైన సంగతి తెలిసిందే.

చదవండి: మోదీ నువ్వు సామాన్యుడివి కాదయ్యా: హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement