పరాభవమే మిగిలింది | R Krishnaiah Talk About On Telangana Elections Results | Sakshi
Sakshi News home page

పరాభవమే మిగిలింది

Dec 12 2018 2:09 AM | Updated on Dec 12 2018 2:09 AM

R Krishnaiah Talk About On Telangana Elections Results - Sakshi

బీసీ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య

సాక్షి, హైదరాబాద్‌: సామాజిక వర్గాల అభ్యున్నతే ఎజెండాగా ఉద్యమించిన నేతలకు ఈ ఎన్నికల్లో పరాభవమే ఎదురైంది. బీసీ సంఘం నేతగా జాతీయస్థాయి ఖ్యాతి ఉన్న ఆర్‌.కృష్ణయ్య గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎల్‌బీనగర్‌లో పోటీ చేసి గెలుపొందగా ఈసారి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌తో మిర్యాలగూడలో పోటీ చేసి పరాజయం పొందారు. బీసీ కులాల ఐక్యవేదిక పేరుతో మనపార్టీని స్థాపించిన కాసాని జ్ఞానేశ్వర్‌ ఈసారి కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసి మంత్రి పద్మారావు చేతిలో ఓటమిపాలయ్యారు.

మరోవైపు ఆదివాసీల ఉద్యమాన్ని ఉదృతంగా నడిపించిన సోయం బాబురావు కూడా కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. బాబురావు మినహా కాసాని జ్ఞానేశ్వర్, ఆర్‌.కృష్ణయ్యలు స్థానికేతర నేతలు కావడం, నామినేషన్లకు చివరి రోజున కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా వీరి పేర్లను ప్రకటించడంతో వారికి క్షేత్రస్థాయిలో ప్రచారం కత్తిమీదసాములా మారింది. ఊహించని విధంగా టికెట్లు ఇవ్వడమే వీరి ఓటమికి కారణాలని చెప్పొచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement