ఆర్ఎస్ఎస్కు 'మోడీ-జోషీ-వారణాశి' సంకటం | RSS Varanasi seat row: RSS worried but believes BJP will solve it | Sakshi
Sakshi News home page

ఆర్ఎస్ఎస్కు 'మోడీ-జోషీ-వారణాశి' సంకటం

Mar 9 2014 4:20 PM | Updated on Mar 29 2019 9:18 PM

ఆర్ఎస్ఎస్కు 'మోడీ-జోషీ-వారణాశి' సంకటం - Sakshi

ఆర్ఎస్ఎస్కు 'మోడీ-జోషీ-వారణాశి' సంకటం

ఆర్ఎస్ఎస్కు బీజేపీ నాయకుల వైఖరి వల్ల సంకట స్థితి ఎదురైంది. అదే వారణాశి ఎంపీ సీటు వ్యవహారం.

బెంగళూరు: సంఘ్ పరివార్ మాటంటే భారతీయ జనతా పార్టీ నాయకగణానికి వేదవాక్కు. బీజేపీ రాజకీయాల్లో, ఆ పార్టీ విధాన నిర్ణయాల్లో ఆర్ఎస్ఎస్ మాటకు తిరుగుండదు. బీజేపీలో ఎదగాలంటే సంఘ పరివార్ ఆశీస్సులు కావాల్సిందే. ఆగ్రహానికి గురైతే ఎంతటి నాయకుడైనా తెరమరుగు కాక తప్పదు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ.. మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ ఉదంతాలే ఇందుకు నిదర్శనం. అలాంటి ఆర్ఎస్ఎస్కు బీజేపీ నాయకుల వైఖరి వల్ల సంకట స్థితి ఎదురైంది. అదే వారణాశి ఎంపీ సీటు వ్యవహారం.

వారణాశి నుంచి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, నరేంద్ర మోడీ ఇక్కడి నుంచి లోక్సభకు పోటీ చేస్తారనే వార్తలు రావడంతో జోషీ అలకబూనారు. దీనికి తోడు బీజేపీ విడుదల చేసిన లోక్సభ అభ్యర్థుల రెండు జాబితాల్లో జోషీ పేరు లేకపోవడంతో ఆయనకు మరింత ఆగ్రహం తెప్పించింది. వారణాశి అభ్యర్థి ఎవరన్న విషయం బీజేపీలో విభేదాలకు దారితీసింది. ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుంటే ఇదేమంత పెద్ద సమస్య కాబోదు. పైగా మోడీ, జోషీలిద్దరూ ఆర్ఎస్ఎస్కు అత్యంత ప్రీతిపాత్రులు. అయితే, సంఘ ఆందోళనకూ ఇదే కారణం. వారణాశి సీటు కోసం మోడీ, జోషీ పోటీపడుతున్నట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ అన్నారు. ఈ సమస్యను బీజేపీ పరిష్కరించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement