'వారణాసిలో మోడీని ప్రజలు ఓడిస్తారు'
ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి ఓటమి తప్పదని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పారు.
ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి ఓటమి తప్పదని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పారు. లోకసభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అభ్యర్థిత్వం ఖారారైంది. వారణాసి లౌకిక ప్రాంతమని.. అలాంటి ప్రదేశంలో మతతత్వ మోడీకి ప్రజలు బుద్ది చెబుతారని లాలూ వ్యాఖ్యానించారు.
మతతత్వ పార్టీలను అధికారంలోకి రాకుండా తన పార్టీ పోరాటం చేస్తుందని.. మోడీని ప్రధాని కాకుండా ఆపడమే ఏకైక లక్ష్యమని లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు.
అయితే వారణాసి బరిలో మోడి నిలవడం ఉత్తర ప్రదేశ్ లో పార్టీకి మరింత బలాన్ని ఇస్తుందని.. అతిపెద్ద రాష్ట్రంలో మెజారిటి సీట్లు సాధిస్తామని బీజేపీ విశ్వాసాన్ని ప్రకటించింది.