లాక్‌డౌన్ ఎత్తివేసిన కేర‌ళ స‌ర్కార్

Kerala Lifts Lockdown On Sundays Night Curfew Remain Same - Sakshi

తిరువ‌నంత‌పురం : రాష్ట్రంలో ప్ర‌స్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను ఆదివారాల్లో ఎత్తివేస్తున్న‌ట్లు కేర‌ళ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అయితే రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు ఉన్న క‌ర్ఫ్యూ నిబంధ‌న‌ల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఆదివారాల్లో కూడా క‌ర్ఫ్యూ స‌మ‌యాల్లో ఎలాంటి మిన‌హాయింపులు లేవ‌ని స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా గ‌డిచిన 24 గంటల్లోనే 150 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వంద‌ల్లో కేసులు న‌మోద‌వుడం వ‌రుస‌గా ఇది ఎనిమిదో రోజు. (కేంద్రానికి కృతజ్ఞతలు: కేజ్రీవాల్‌ )

రాష్రంలో ఇప్ప‌టివర‌కు మొత్తం 2,09,456 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నిన్న ఒక్కరోజే 5,859 నమూనాలను సేక‌రించిన‌ట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైల‌జ తెలిపారు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 22కు చేరింద‌ని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top