మౌలిక వసతుల రంగానికి నిధుల సమస్య ఎక్కువకాలం ఉండబోదని, ఈ రంగంలోని ప్రాజెక్టులను వేగవంతం చేయాలని నీతి ఆయోగ్ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు.
న్యూఢిల్లీ: మౌలిక వసతుల రంగానికి నిధుల సమస్య ఎక్కువకాలం ఉండబోదని, ఈ రంగంలోని ప్రాజెక్టులను వేగవంతం చేయాలని నీతి ఆయోగ్ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. సోమవారం ఢిల్లీలో ఆయన ఈ మేరకు మౌలిక వసతుల ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి వివిధ శాఖల మధ్య, కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రధాని సూచించారు.
దేశాన్ని వేగవంతంగా విద్యుదీకరించేందుకు, సౌరవిద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు, రైల్వేలు, తీరప్రాంత నెట్వర్క్లను అభివృద్ధిలో సమీకృతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఏ విద్యుత్ కేంద్రానికీ బొగ్గు కొరత లేదని, ఆ సమస్య పరిష్కారమైందని సమావేశంలో అధికారులు తెలిపారు. సమావేశంలో విద్యుత్, బొగ్గు, రోడ్లు, ఇతర మౌలిక రంగాలపై నీతి ఆయోగ్ సవివర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది.