మౌలిక ప్రాజెక్టులను వేగవంతం చేయాలి: మోదీ | Infrastructure projects should be accelerated: Modi | Sakshi
Sakshi News home page

మౌలిక ప్రాజెక్టులను వేగవంతం చేయాలి: మోదీ

Feb 10 2015 4:05 AM | Updated on Aug 15 2018 2:20 PM

మౌలిక వసతుల రంగానికి నిధుల సమస్య ఎక్కువకాలం ఉండబోదని, ఈ రంగంలోని ప్రాజెక్టులను వేగవంతం చేయాలని నీతి ఆయోగ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు.

న్యూఢిల్లీ: మౌలిక వసతుల రంగానికి నిధుల సమస్య ఎక్కువకాలం ఉండబోదని, ఈ రంగంలోని ప్రాజెక్టులను వేగవంతం చేయాలని నీతి ఆయోగ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. సోమవారం ఢిల్లీలో ఆయన ఈ మేరకు మౌలిక వసతుల ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి వివిధ శాఖల మధ్య, కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రధాని సూచించారు.

దేశాన్ని వేగవంతంగా విద్యుదీకరించేందుకు, సౌరవిద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు, రైల్వేలు, తీరప్రాంత నెట్‌వర్క్‌లను అభివృద్ధిలో సమీకృతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఏ విద్యుత్ కేంద్రానికీ బొగ్గు కొరత లేదని, ఆ సమస్య పరిష్కారమైందని సమావేశంలో అధికారులు తెలిపారు. సమావేశంలో విద్యుత్, బొగ్గు, రోడ్లు, ఇతర మౌలిక రంగాలపై నీతి ఆయోగ్ సవివర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement