ఛత్తీస్‌గఢ్‌లో ఏడుగురు మావోల ఎన్‌కౌంటర్‌ | 7 Maoists Killed In Chhattisgarh Encounter | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో ఏడుగురు మావోల ఎన్‌కౌంటర్‌

Jul 19 2018 12:36 PM | Updated on Oct 9 2018 2:53 PM

7 Maoists Killed In Chhattisgarh Encounter - Sakshi

దంతెవాడ : ఛత్తీస్‌గఢ్‌ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. దంతెవాడ- బీజాపూర్‌ జిల్లా సరిహద్దులోని గంగుళూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో ఏడుగురు మావోయిస్టులు చనిపోగా మరికొందరు గాయాలతో తప్పించుకున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. సంఘటనా స్థలంలో భారీ సంఖ్యలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

దంతెవాడ అడవుల్లో మావోయిస్టులు తిరుగుతున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు భారీ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య భీకర్‌ కాల్పులు జరిగాయి. ఇందులో మొత్తం ఏడుగురు మావోయిస్టులు మరణించగా మరికొందరు గాయాలతో తప్పించుకున్నారు. వారికోసం స్పెషల్‌ టీమ్‌ తిమేనార్‌ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement