రకుల్‌కు బంపర్ ఆఫర్?

రకుల్‌కు బంపర్ ఆఫర్?


ఇప్పుడు తెలుగులో క్రేజీయెస్ట్ హీరోయిన్ ఎవరు? నో డౌట్. రకుల్ ప్రీత్‌సింగే. తన గ్లామర్‌తో యూత్ హార్ట్స్‌లో ప్లేస్ సంపాదించిన రకుల్ ఇప్పుడు చేసేవన్నీ టాప్‌స్టార్స్ సినిమాలే. ‘నాన్నకు ప్రేమతో...’లో సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్న ఈ బ్యూటీకి ‘బ్రహ్మోత్సవం’లో మహేశ్‌బాబు సరసన నటించే అవకాశం లభించనుందట.

 

 ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత. నిజానికి, సమంత ఇప్పటివరకూ ఈ షూటింగ్‌లోకి ఎంటర్ కాలేదు. తమిళంలో ఆమె చాలా బిజీగా ఉండటంతో, ‘బ్రహ్మోత్సవం’కు ఆమె ఎంతవరకు డేట్స్ కేటాయిస్తారనే అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో రకుల్ ప్రీత్‌సింగ్‌ను తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టుగా ఫిలిమ్    నగర్‌లో వినికిడి.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top