భారత ఉపఖండంలో అల్ఖైదా శాఖ!!

భారత ఉపఖండంలో అల్ఖైదా శాఖ!!


అగ్రరాజ్యం అమెరికానే గడగడలాడించిన ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా.. ఇప్పుడు భారత ఉప ఖండంలో కూడా ఓ కొత్త శాఖ తెరిచిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థ నాయకుడు ఆయమాన్ అల్ జవహరి ప్రకటించారు. భారత ఉప ఖండంలోనే చిత్రీకరించిన ఓ వీడియో మెసేజిలో ఈ విషయం తెలిపారు.



ఆన్లైన్ జీహాదిస్ట్ ఫోరంలో ఈ వీడియో కనిపించింది. ప్రధానంగా బర్మా, బంగ్లాదేశ్లతో పాటు.. భారతదేశంలోని కొన్ని భాగాల్లో ముస్లిం ఖలీఫా వ్యవస్థను పునరుద్ధరించడానికి ఈ కొత్త దళం పనిచేస్తుందని ఆ వీడియోలో అల్ జవహరి చెప్పినట్లుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top