ఇది భూములు లాక్కునే ప్రభుత్వం | thammineni veerabadram fired on trs government | Sakshi
Sakshi News home page

ఇది భూములు లాక్కునే ప్రభుత్వం

Jan 23 2017 3:40 AM | Updated on Jul 11 2019 9:04 PM

ఇది భూములు లాక్కునే ప్రభుత్వం - Sakshi

ఇది భూములు లాక్కునే ప్రభుత్వం

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు భూములివ్వకుండా ఉన్నవి లాక్కు నేదిగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
గోవిందరావుపేట: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు భూములివ్వకుండా ఉన్నవి లాక్కు నేదిగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర ఆదివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గోవిందరావు పేట మండలం మచ్చాపూర్‌లోకి ప్రవేశించింది. 

తమ్మినేని మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే కష్టాలే ఉండవని చెప్పిన సీఎం కేసీఆర్‌.. ఎన్ని కలకు ముందు అనేక వాగ్దానాలు చేశారని, వాటిని అమలు చేయ డంలో శ్రద్ధ చూపడం లేదని విమ ర్శించారు. పాదయాత్ర సంద ర్భంగా ప్రజలు ఇచ్చిన ప్రతీ దర ఖాస్తును ప్రభుత్వం వరకు చేర్చి సమస్యల పరిష్కారానికి పోరాడతామన్నారు. తమ్మినేని పాదయాత్రకు టీడీపీ, వైఎస్సార్‌సీపీ, తుడుందెబ్బ, గీతకార్మిక సంఘం నాయకులు సంఘీభావం ప్రకటించారు. పాదయాత్రలో పలువురు సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement