
అసెంబ్లీని తక్షణమే సమావేశపర్చాలి: షబ్బీర్
రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై చర్చించి, పరిష్కరించడానికి వెంటనే అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలను ఏర్పాటు చేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై చర్చించి, పరిష్కరించడానికి వెంటనే అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలను ఏర్పాటు చేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. సీఎల్పీ ఉపనాయకులు టి.జీవన్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలసి హైదరాబాద్లో ఆయన శనివారం మాట్లాడుతూ.. రైతుల సమస్యలు, భూసేకరణ విధానం వంటి అంశాలపై చర్చకోసం అసెంబ్లీని సమావేశపర్చాలని కోరారు.
వరుసగా నాలుగు పంటలను కోల్పోయిన రైతాంగం తీవ్ర నిరాశలో ఉందన్నారు. రూ.లక్ష లోపు పంటరుణాలు మాఫీ చేస్తామని హామీనిచ్చిన సీఎం కేసీఆర్ రెండేళ్లయినా పూర్తిచేయలేదని విమర్శించారు.