ముస్లిం రిజర్వేషన్లపై కేసీఆర్ మోసం | kcr cheating on muslim reservations :shabbir ali | Sakshi
Sakshi News home page

ముస్లిం రిజర్వేషన్లపై కేసీఆర్ మోసం

Apr 7 2016 2:55 AM | Updated on Oct 16 2018 5:59 PM

ముస్లిం రిజర్వేషన్లపై కేసీఆర్ మోసం - Sakshi

ముస్లిం రిజర్వేషన్లపై కేసీఆర్ మోసం

అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, రెండేళ్లు పూర్తవుతున్నా దానిని అమలు

శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, రెండేళ్లు పూర్తవుతున్నా దానిని అమలు చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ విమర్శించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముస్లింలకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా కుట్ర బుద్ధితో ఉన్న టీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గతంలో ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 56 రోజుల్లోనే 5 శాతం రిజర్వేషన్లు కల్పించినట్టుగా గుర్తుచేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, బీసీ కమిషన్ వంటివాటిలో ఎదురైన న్యాయ సమస్యల వల్ల అది 4 శాతానికే పరిమితమైందని షబ్బీర్ వివరించారు. రిజర్వేషన్ల విధానం, చట్టం, ప్రజాస్వామ్యంపై కనీస అవగాహన లేకుండా మంత్రి కేటీఆర్ నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement