ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఆదివారం జరిగే శ్రీసీతారామచంద్రస్వామి పట్టాభిషేక మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సతీసమేతంగా హాజరుకానున్నారు.
హైదరాబాద్ : ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఆదివారం జరిగే శ్రీసీతారామచంద్రస్వామి పట్టాభిషేక మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సతీసమేతంగా హాజరుకానున్నారు. ఆయన ఉదయం 7 గంటలకు హెలికాప్టర్లో భద్రాచలం బయలుదేరారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే రాముల వారి పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు.