ఔను.. హైదరాబాద్లో ఆఫీసు పెడుతున్నాం
ధ్రువీకరించిన యాపిల్ సంస్థ
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ హైదరాబాద్లో కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు వచ్చిన వార్తలను ధ్రువీకరించింది. హైదరాబాద్లో కొత్తగా డెవలప్మెంట్ ఆఫీసును ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ తెలి పింది. ఇందులో సుమారు 150 మంది ఉద్యోగులు ఉంటారని, వీరు మ్యాప్స్ అభివృద్ధి కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారని యాపిల్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
ఈ ఏడాది చివర్లో అమెరికా క్యూపర్టినోలోని కొత్త క్యాం పస్ హెడ్క్వార్టర్స్కి సిబ్బంది తరలింపు మొదలుపెట్టే సమయంలో ఇక్కడ కార్యాలయం నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వివరించారు. భారత్లో కార్యకలాపాల విస్తర ణపై తాము గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నామని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. యాపిల్ దాదాపు 25 మిలియన్ డాలర్లతో హైదరాబాద్లో కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 4,500 మంది నిర్మాణంలో పాలుపంచుకోవచ్చని అంచనా.
సంబంధిత వార్తలు