మన్మోహన్ కోసం సిద్ధమవుతోన్న బంగళా | manmohan singh may shift to motilal nehru road bungalow before lok sabha results | Sakshi
Sakshi News home page

మన్మోహన్ కోసం సిద్ధమవుతోన్న బంగళా

Published Mon, Apr 7 2014 2:07 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

మన్మోహన్ కోసం సిద్ధమవుతోన్న బంగళా - Sakshi

మన్మోహన్ కోసం సిద్ధమవుతోన్న బంగళా

ప్రధానమంత్రిగా పదవీకాలం పూర్తయిన తర్వాత మన్మోహన్‌సింగ్.. మోతీలాల్ నెహ్రూ రోడ్‌లోని మూడో నంబర్ బంగళాలోకి మారనున్నారు. అరుయితే మే 16న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడికాక ముందే ఆయన కొత్త నివాసంలోకి మారవచ్చని సమాచారం.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రిగా పదవీకాలం పూర్తయిన తర్వాత మన్మోహన్‌సింగ్.. మోతీలాల్ నెహ్రూ రోడ్‌లోని మూడో నంబర్ బంగళాలోకి మారనున్నారు. అరుయితే మే 16న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడికాక ముందే ఆయన కొత్త నివాసంలోకి మారవచ్చని సమాచారం. ఈ నెల 30 తేదీలోగా బంగళాలో పనులన్నీ పూర్తి చేయూల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయం ప్రజా పనుల విభాగాన్ని ఆదేశించింది. ఏప్రిల్ 30వ తర్వాత ఏ రోజైనా ప్రధాని ఆ ఇంటికి మారవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.
 
 1920లో నిర్మించిన ఈ నాలుగు పడక గదులతో కూడిన బంగళా సుమారు 3.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులోనే ఓ జీవ వైవిధ్య పార్కు కూడా ఉంది. కాగా బంగళాకు కొత్తగా రంగులు వేయడంతో పాటు గచ్చు, పైకప్పు ఇతర మరమ్మతులకు రూ.35 లక్షలు వెచ్చించారు. ఈ బంగళాలో ఇంతకుముందు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఉండేవారు. ఫిబ్రవరిలో ఆమె ఖాళీ చేసిన తర్వాత ప్రధాని, ఆయన సతీమణి గురుశరణ్ కౌర్ ఈ బంగళాను సందర్శించి ఖరారు చేశారు. వీరు ప్రస్తుతం రేస్‌కోర్స్ రోడ్‌లోని ప్రధాని అధికార నివాసంలో ఉంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement