కేసీఆర్‌కు తెలంగాణ అప్పగిస్తే.. మోసగాడికి తాళంచెవి ఇచ్చినట్లే! | He entrusted kcr ..   Key result mosagadiki! | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు తెలంగాణ అప్పగిస్తే.. మోసగాడికి తాళంచెవి ఇచ్చినట్లే!

Apr 9 2014 3:42 AM | Updated on Sep 27 2018 8:33 PM

కేసీఆర్‌కు తెలంగాణ అప్పగిస్తే..  మోసగాడికి తాళంచెవి ఇచ్చినట్లే! - Sakshi

కేసీఆర్‌కు తెలంగాణ అప్పగిస్తే.. మోసగాడికి తాళంచెవి ఇచ్చినట్లే!

ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణను టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు చేతిలోపెడితే.. మోసగాడికి ‘తాళం చెవి’ అప్పగించినట్లేనని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

గజ్వేల్ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ నేత దామోదర ధ్వజం
 
 గజ్వేల్, ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణను టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు చేతిలోపెడితే.. మోసగాడికి ‘తాళం చెవి’ అప్పగించినట్లేనని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తూం కుంట నర్సారెడ్డి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా.. సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రికి మరొకటి మాట్లాడే కేసీఆర్ పచ్చి మోసగాడని దుయ్యబట్టారు. ఆరు దశాబ్దాలుగా సీమాంధ్రుల ఆధిపత్యంతో నష్టపోయిన తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు రాజ్యాధికారం గనుక అప్పగిస్తే తుంట ఎత్తేసి.. మొద్దు ఎత్తుకున్నట్లవుతుందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాపలికుక్కలా పనిచేస్తానని, దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని, ముస్లింలను ఉప ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన మాటలేమయ్యాయని ఆయన ప్రశ్నించారు. దళితులు నిన్నేమైనా సీఎం పదవి కావాలని అడిగారా? ముస్లింలు ఉపముఖ్యమంత్రి కావాలని కోరారా? కాంగ్రెస్‌కు పాలనా అనుభవం లేదని విలీనం చేయాలని కోరిందా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ పునర్నిర్మాణమంటే దొరల గడీలను బాగుచేయడమా?అని మండిపడ్డారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ చేసిన పోరాటం వల్ల ఊదు కాలలేదు, పీరు ఎగురలేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ ప్రాంత ఎంపీలు పోరాటం చేయడం, సోనియాగాంధీ చొరవ వల్లే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement